బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన కిషన్​ రెడ్డి

-

తెలంగాణ బీజేపీ నూతన అధ్యక్షుడిగా కేంద్ర మంత్రి గంగాపురం కిషన్​రెడ్డి నాలుగోసారి బాధ్యతలు స్వీకరించారు. ఇవాళ మధ్యాహ్నం 12:40 గంటలకు నాంపల్లిలోని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో హైకమాండ్​ ఆదేశాలను అనుసరించి ఆయన బాధ్యతలు చేపట్టారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్​కు రెండు సార్లు, తెలంగాణకు తొలి రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వర్తించిన కిషన్​రెడ్డి మరోసారి బాధ్యతలు చేపట్టారు.

ఈరోజు ఉదయం 7 గంటల 30 నిమిషాలకు పాతబస్తీ భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయానికి చేరుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం 8:20 గంటలకు అంబర్​పేటకు చేరుకుని మహాత్మా జ్యోతి బాపులే విగ్రహాం వద్ద నివాళులు అర్పించారు. అక్కడి నుంచి నేరుగా బషీర్​బాగ్​లోని కనకదుర్గ అమ్మవారి ఆలయానికి 8:50 గంటలకు చేరుకొని అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. తరువాత ట్యాంక్ బండ్ వద్ద అంబేడ్కర్ విగ్రహానికి నివాళులు అర్పించారు. అనంతరం గన్​పార్క్​ వద్ద ఉన్న అమరుల స్థూపం వద్ద నివాళులు అర్పించారు.

అక్కడి నుంచి నేరుగా నాంపల్లిలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయానికి ర్యాలీగా చేరుకుని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టారు. ఈ కార్యక్రమానికి  పార్టీ కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.

Read more RELATED
Recommended to you

Latest news