టీ కాంగ్రెస్ నేతలపై కేసీ వేణుగోపాల్ ఫైర్‌.. ఇలాగే ఉంటే కష్టమని వ్యాఖ్య

-

తెలంగాణలో ఎన్నికల సమయం దగ్గరపడుతోంది. ఈ సారి ఎలాగైనా అధికారంలోకి రావాలని కాంగ్రెస్‌, బీజేపీ పార్టీ నేతలు ఇప్పటికే గ్రౌండ్‌ వర్క్‌ స్టార్ట్‌ చేసుకున్నారు. అయితే.. ఈ సారి కూడా అధికారంలోకి వచ్చి హ్యాట్రిక్‌ కొట్టాలని భావిస్తోంది బీఆర్‌ఎస్‌. అయితే.. తెలంగాణ వచ్చిననాటి నుంచి చెతికిలపడ్డ కాంగ్రెస్‌ పార్టీలో గందరగోళం నెలకొంది. ఈ రోజు మంత్రి కేటీఆర్‌ సైతం అసెంబ్లీ సమావేశాల్లో టీ కాంగ్రెస్‌ నేతల్లో ఐక్యత లేదన్నట్లుగా విమర్శలు సంధించారు. అయితే.. వరుసగా ఎన్నికలకు సంబంధించిన కమిటీలు ప్రకటిస్తూ తుది సమరానికి సిద్ధం అవుతుంది కాంగ్రెస్‌.

KC Venugopal: 50% of office bearers in Congress should be under 50 years of  age, says KC Venugopal - The Economic Times Video | ET Now

అభ్యర్థుల ఎంపిక, ఎన్నికల్లో అనుసరించిన వ్యూహాలపై కసరత్తు చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే తెలంగాణ కాంగ్రెస్ నేతలతో ఇవాళ పార్టీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ భేటీ అయ్యారు. ఈ సమావేశంలో తెలంగాణ కాంగ్రెస్ నేతలకు ఆయన క్లాస్ ఇచ్చినట్లు తెలుస్తోంది. మీకు ఇంకా 100 రోజులే సమయం ఉందని.. అన్ని పక్కన పెట్టి ఈ 100 రోజులు కష్టపడి పని చేయాలని సూచించారు. ఎన్నికలకు తక్కువ సమయం ఉన్నప్పటికీ ఇంకా మేం ఇలాగే కొట్లాడుకుంటామంటే ఇక మీ ఇష్టమన్నారు. ఓ నలుగురు నేతలు నేతలు అన్నీ పక్కన పెట్టి ఈ 100 రోజులు కలిసి పనిచేయండని సూచించారు. పార్టీ అధికారంలోకి వస్తే తాము ఇక్కడికి వచ్చి మంత్రులం కామని తెలంగాణ కాంగ్రెస్ నేతలకు స్వీట్ వార్నింగ్ ఇచ్చారు. కాగా, ఈ భేటీలో కేసీ వేణుగోపాల్ ముందే మండలి కమిటీల గురించి రాష్ట్ర కాంగ్రెస్ నేతలు హాట్ హాట్‌గా చర్చించుకున్నట్లు సమాచారం.

Read more RELATED
Recommended to you

Latest news