బంపర్ ఆఫర్ కొట్టేసిన రష్మిక.. ఏకంగా పాన్ ఇండియా హీరోలతో..!

-

ప్రముఖ టాలీవుడ్ బ్యూటీ రష్మిక మందన్న ఇటీవల పుష్ప సినిమాతో పాన్ ఇండియా హీరోయిన్ గా మారిపోయి టాలీవుడ్ లో ఒక వెలుగు వెలుగుతోంది. అంతేకాదు బాలీవుడ్ లో కూడా వరుసగా అవకాశాలు అందుకొని సినిమాలు చేస్తోన్న ఈమె.. కోలీవుడ్ లో కూడా సత్తా చాటడానికి సిద్ధమవుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే తమిళ స్టార్ నటుడితో నటించే అవకాశాన్ని దక్కించుకుంది. ఇప్పటికే అన్ని చర్చలు పూర్తయ్యాయి అని , త్వరలోనే షూటింగ్ ప్రారంభం కానుందని చిత్రబృందం వెల్లడించింది. ముఖ్యంగా కోలీవుడ్ స్టార్ హీరో చియాన్ విక్రమ్ కొత్త సినిమాలో రష్మిక హీరోయిన్ గా ఎంపికైనట్లు సమాచారం.

అంతేకాదు ఈ సినిమాలో విజయ్ సేతుపతి కూడా కీలకపాత్ర పోషిస్తున్నారట. తాజా సూపర్ హిట్ మలయాళ చిత్రం 2018 కి దర్శకత్వం వహించిన జూడ్ ఆంటోనీ జోసెఫ్ ఈ మల్టీ స్టారర్ సినిమాని తెరకెక్కిస్తున్నట్లు సమాచారం. ముఖ్యంగా చియాన్ విక్రమ్ , రష్మిక, విజయ్ సేతుపతి తో లైకా నిర్మాణ సంస్థ సంప్రదింపులు జరిపిందని, వారు కూడా ఒకే చెప్పినట్లు తెలుస్తోంది. ఇకపోతే విభిన్న వ్యక్తిత్వాలు కలిగిన వ్యక్తులకు సంబంధించిన కథాంశంతో ఈ సినిమా ఉంటుందని అయితే దీని గురించి కచ్చితంగా సమాచారం ఇంకా రావాల్సి ఉందని తెలుస్తోంది.

ఇదిలా ఉండగా మరొకపక్క జూడ్ ఆంటోనీ దర్శకత్వం వహించిన 2018 చిత్రం ఎంత పెద్ద హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తక్కువ బడ్జెట్ తో హై క్వాలిటీ లో తీసిన ఈ సినిమాపై ప్రశంసల వర్షం కురుస్తోంది. అంతేకాదు ఈ సినిమా వసూళ్ల విషయంలో సరికొత్త రికార్డు కూడా సృష్టించింది. జూడ్ ఒక దర్శకుడు మాత్రమే కాదు మంచి నటుడు కూడా.. ప్రేమమ్ తో పాటు పలు కొన్ని మలయాళం సినిమాలలో చిన్న చిన్న పాత్రల్లో కూడా నటించారు. ఇకపోతే రష్మికానీ ఆయన హీరోయిన్గా సెలెక్ట్ చేశారు కాబట్టి రష్మిక క్రేజ్ మరింత పెరిగే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news