‘భోళాశంకర్’ సినిమా రిలీజ్‌కు గ్రీన్‌ సిగ్నల్‌

-

భోళా శంకర్‌ చిత్ర నిర్మాత సుంకర అనిల్ తమను రూ.30 కోట్ల మేరకు మోసం చేశాడని ఆరోపిస్తూ న్యాయస్థానాన్ని ఆశ్రయించారు గాయత్రి ఫిలిం డిస్ట్రిబ్యూటర్ వైజాగ్ సతీష్ అలియాస్ బత్తుల సత్యనారాయణ. గతంలో విడుదలైన ఏజెంట్ సినిమా డిస్ట్రిబ్యూషన్ హక‍్కుల్ని తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాలకు ఐదేళ్ల పాటు గాయత్రి ఫిల్మ్స్‌కు కేటాయిస్తూ అనిల్‌ సుంకర అగ్రిమెంట్ రాసిచ్చారని అందుకు తన నుంచి రూ.30 కోట్లు తీసుకుని మోసం చేశారని కోర్టులో పిటిషన్ వేశారు.

Bhola Shankar' Telugu Movie Review: Chiranjeevi's comedy-action extravaganza

కానీ తనకు విశాఖపట్నం జిల్లా వరకు మాత్రమే హక్కులు ఇచ్చారని, తదనంతర పరిణామాల నేపథ్యంలో తదుపరి సినిమా విడుదలకు ముందే నా డబ్బులు చెల్లిస్తానని చెప్పారన్నారు. దీంతో తాను న్యాయం కోసం కోర్టుకు వచ్చానని చెబుతూ పిటిషన్ దాఖలు చేశారు. అయితే పిటిషన్‌ను సివిల్ కోర్టు కొట్టివేసింది. దీంతో సినిమా విడుదలకు లైన్ క్లియర్ అయింది.

 

 

Read more RELATED
Recommended to you

Latest news