అమెరికాలో భారతీయ విద్యార్థులకు చుక్కెదురు..!

-

సాధారణంగా ఉన్నత చదువులను చదవడం కోసం ఎన్నో ఆశలతో అమెరికాకు వెళ్లిన పలువురు భారతీయ విద్యార్థులకు చక్కెదురైంది. దాదాపు 21 మంది విద్యార్థులను అమెరికా ఇమ్మిగ్రేషన్ అధికారులు తిరిగి భారత్ కి పంపారు. అమెరికాలోని పలు యూనివర్సిటీలలో ఉన్నత చదువుల కోసం విద్యార్థులు అమెరికా వెళ్లగా.. సరైన పత్రాలు లేవని అనుమతి నిరాకరించారు. వీసా ప్రక్రియలను పూర్తి చేసినప్పటికీ.. ఆయా విశ్వవిద్యాలయాల నుంచి అడ్మిషన్లు పొందినా కూడా మెయిల్స్, సోషల్ మీడియా అకౌంట్లను తనిఖీ చేసిన తరువాత అధికారులు తిరిగి వారిని భారత్ కి పంపించారు. 

 

అట్లాంట, శాన్ ఫ్రాన్సిస్కో షికాగోలో విద్యార్థులు చేదు అనుభవం ఎదురైంది. భారతీయ విద్యార్థులను తిరిగి ఎయిర్ ఇండయా విమానంలో భారత్ కి పంపించారు. ఆయా విద్యార్థులు అమెరికాలో ప్రవేశించకుండా ఐదేళ్ల పాటు నిషేదం విధించారు. సరైన డాక్యుమెంట్లు లేకపోవడంతో విద్యార్థులను తిప్పి పంపినట్టుగా తెలుస్తోంది. తెలుగు రాష్ట్రాలు చెందిన విద్యార్థులు సైతం ఉన్నట్టు తెలుస్తోంది. ఇక ఈ వ్యవహారంతో విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళనకు గురవుతున్నారు. 

Read more RELATED
Recommended to you

Latest news