కాంగ్రెస్‌ సీడబ్ల్యూసీ మీటింగ్‌పై దాసోజు ఆసక్తికర వ్యాఖ్యలు

-

తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ రానున్న ఎన్నికల నేపథ్యంలో దూకుడుగా ముందుకు వెళుతుంది. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా అనేక కార్యక్రమాలను నిర్వహించడంతోపాటు, కీలక నేతలను కాంగ్రెస్ పార్టీలో చేర్చుకుంటూ, కాంగ్రెస్ పార్టీ బీజేపీని బీట్ చేసే పనిలో పడింది. తెలంగాణ రాష్ట్రంలో గులాబీ పార్టీకి ప్రత్యామ్నాయ రాజకీయ పార్టీ కాంగ్రెస్ పార్టీ అని చెప్పే ప్రయత్నం చేస్తుంది. అయితే.. తెలంగాణలో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశాలని మీరు అధికారంలో ఉన్న రాష్ట్రాలను సైతం వదిలి, హైదరాబాద్ నగరంలో నిర్వహించాలని కాంగ్రెస్ అధినాయకత్వం నిర్ణయించడం, తద్వారా జడ్ ప్లస్ సెక్యూరిటీ ఉన్న కీలక నాయకులు సైతం ఈ సమావేశాలకు రావడం హర్షణీయం.

Be wary of BJP's sinister moves, says Dasoju Sravan-Telangana Today

గతంలో ఉగ్రవాదులకు అడ్డాగా, ముఖ్యమంత్రుల మార్పిడి కోసం జరిగిన కుట్రలతో రాజకీయ ప్రేరేపిత మతకల్లోలాలకు వేదిక అయిన తెలంగాణ రాష్ట్రం, ముఖ్యంగా హైదరాబాద్ నగరం ఇవాళ మీ పార్టీ ఉన్నత స్థాయి సమావేశానికి వేదికగా గుర్తించబడ్డది అంటే, దానికి ఏకైక కారణం తెలంగాణ ఉద్యమ సారధి, గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ దార్శనికత, గత పది ఏళ్ళ నుండి అయన నాయకత్వంలో శాంతిభద్రతలను కాపాడుతూ అన్ని రంగాలను అభివృద్ధి చేస్తూ కొనసాగుతున్న పటిష్టమైన పరిపాలన అన్న విషయాన్నీ గుర్తించాలి.

ఐతే హైదరాబాద్ కు వస్తున్న కాంగ్రెస్ అగ్ర నాయకులు నిష్పక్షపాతంగా స్వచ్ఛమైన మనసుతో తెలంగాణ అభివృద్ధి నమూనాను లోతుగా అధ్యయనం చేయాలనీ, తెలంగాణ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను చూసి నేర్చుకొని మీరు పాలించే రాష్ట్రాలలో, మరియు మీరు ప్రతిపక్షంగా ఉన్న రాష్ట్రాలలో తెలంగాణ అభివృది నమూనాను అమలు చేయించేందుకు మీరు కృషి చేయాలనీ కోరుతున్నాను.

Read more RELATED
Recommended to you

Latest news