2029 యూత్​ ఒలింపిక్స్​ ఆతిథ్యానికి.. భారత్​ రెడీ : ప్రధాని మోదీ

-

ఒలింపిక్స్‌కు ఆతిథ్యం ఇవ్వడానికి భారత్ ఎంతో ఉత్సాహంగా ఎదురుచూస్తోందని.. 2029 యూత్ ఒలింపిక్స్‌కు ఆతిథ్యం ఇచ్చేందుకు​ సిద్ధంగా ఉన్నట్లు ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారు. అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ నుంచి తమకు కచ్చితంగా మద్దతు లభిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. 2036 ఒలింపిక్స్​ నిర్వహణకు వచ్చిన ఏ ఒక్క అవకాశాన్ని భారత్​ వదులుకోదని మోదీ స్పష్టం చేశారు.

మహారాష్ట్ర ముంబయిలో నీతా ముకేశ్​ అంబానీ కల్చరల్ సెంటర్​లో 141వ అంతర్జాతీయ ఒలింపిక్​ కమిటీ సెషన్​లో​ మోదీ ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భారత్​లో ఒలింపిక్స్​ నిర్వహణ.. 140 కోట్ల మంది భారతీయుల కల అని అభివర్ణించారు. ప్రపంచ స్పోర్ట్స్​ టోర్నమెంట్​లను నిర్వహించే సామర్థ్యాన్ని భారత్​ ప్రదర్శించిందని తెలిపారు.

“సింధు లోయ నాగరికత నుంచి వేదాల యుగం వరకు.. మన దేశంలో క్రీడల వారసత్వం సుసంపన్నంగా ఉంది. ‘ఒకే భూమి- ఒకే కుటుంబం- ఒక భవిష్యత్తు’ అనే భావనను క్రీడలు బలపరుస్తున్నాయి. దేశంలో క్రీడాకారులను ప్రోత్సహించేందుకు బీజేపీ ప్రభుత్వం విశేషంగా కృషి చేస్తోంది. భారత్​లో 40 ఏళ్ల తర్వాత ఐఓసీ సెషన్​ జరగడం.. అది కూడా ముంబయిలో జరగడం దేశానికి గర్వకారణం” అని మోదీ అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news