బీఆర్ఎస్ పార్టీలో చేరిన చెరుకు సుధాకర్, కొప్పుల హరిదీప్ రెడ్డి

-

మంత్రులు కేటీఆర్ ,హరీష్ రావు సమక్షంలో చెరుకు సుధాకర్, ఆత్మకూరుకు చెందిన కొప్పుల హరిదీప్ రెడ్డి బీఆర్ఎస్ లో చేరారు. ఈ సందర్భంగా మంత్రులు కేటీఆర్, హరీష్ రావు పార్టీ కండువాలను కప్పీ పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్ రావు మాట్లాడుతూ.. నా DNA లో బిజెపి పై పోరాటం చేసేది ఉన్నది అని రాహుల్ గాంధీ అన్నారు. రేవంత్ రెడ్డి DNA లో ఏమి ఉన్నది అని రాహుల్ గాంధీ నీ అడుగుతున్న.. కాంగ్రెస్ పార్టీలో 45 స్థానాల్లో పోటీ చేసేందుకు అభ్యర్థులు లేరు అన్నారు.
సోనియా గాంధీనీ తిట్టిన రేవంత్ రెడ్డి నీ పిసిసి అధ్యక్షుడుగా పెట్టీ రాహుల్ గాంధీ రాజకీయాలు చేస్తున్నారు.

తెలంగాణ లో కాంగ్రెస్ కు గాలి ఎక్కడ ఉన్నది ? సక్కగా అభ్యర్థులే లేరు ? కర్ణాటక లో కరెంట్ రావడం లేదని అక్కడి ప్రజలు ఆందోళన చేస్తున్నారు. కేసీఆర్ తెలంగాణ పాలనను దేశం అచరిస్తుంది అన్నారు. కాంగ్రెస్ పార్టీ BRS స్కీమ్ లను కాపీ చేసింది అన్నారు.
కేసీఆర్ కు పనితనం ఉన్నది…పగతనం లేదు అన్నారు. అదే ఉంటే నోటుకు ఓటు కేసులో రేవంత్ జైల్ లో ఉండేవారు.
కేసీఅర్ కు పగలేదు..ఇప్పుడు పక్క రాష్ట్రాల్లో ఏమి జరుగుతుందో చూస్తున్నాం అన్నారు. కాంగ్రెస్ అంటేనే మాటలు, మూటలు,మతం మంటలు రాహుల్ గాంధీ కాదు..రాంగ్ గాంధీ..అని అబద్ధాలు మాట్లాడుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news