తెలంగాణలో ఈసారి బీసీ సీఎం కాబోతున్నారు : మోడీ

-

హైదరాబాద్ లోని ఎల్బీ స్టేడియంలో నిర్వహించిన బీసీ ఆత్మీయ సభకు నరేంద్ర మోడీ ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. బీసీలకు ఏడాదికి రూ.1000 కోట్ల ఫండ్ ఇస్తామని చెప్పి మాట తప్పింది. తెలంగాణలో ఈసారి బీసీ సీఎం రాబోతున్నారు. కేంద్ర క్యాబినెట్ లో అత్యధిక మంది ఓబీసీ వర్గాలకు చెందిన వారే మంత్రులుగా ఉన్నారు. బీఆర్ఎస్ నేతల్లో అహంకారం కనిపిస్తుంది. 2019 లోక్ సభ ఎన్నికల్లో ప్రజలు తగిన గుణపాఠం చెప్పారు. బీఆర్ఎస్ నేతలకి ఢిల్లీ లిక్కర్ స్కామ్ తో సంబంధాలు ఉన్నాయి. ఎవ్వరూ ప్రజాధనాన్ని దోచుకున్నారో వాటిని తిరిగి రాబడుతాం.

తెలంగాణ యువతను మోసం చేసిన బీఆర్ఎస్ ని సాగనంపాలా వద్దా అని ప్రశ్నించారు ప్రధాని మోడీ. నీళ్లు, నిధులు, నియామకాల గురించి తెలంగాణ ఉద్యమం వచ్చిందని తెలిపారు. తొమ్మిదేళ్లుగా తెలంగాణలో బీసీ, ఎస్టీ, ఎస్సీలకు వ్యతిరేక ప్రభుత్వముందని తెలిపారు ప్రధాని మోడీ. ఒకతరం భవిష్యత్ ని బీఆర్ఎస్ నాశనం చేసిందని ప్రధాని పేర్కొన్నారు. తెలంగాణ వేల టీచర్ పోస్టులు ఖాలీగా ఉన్నాయి. ఉచిత రేషన్ ను మరో ఐదేళ్లు పొడిగించామని తెలిపారు. ఉచిత రేషన్ మోడీ ఇస్తున్న గ్యారెంటీ అని పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news