ఏపీ సీఈవోకు వైసీపీ నేతల ఫిర్యాదు

-

ఆంధ్రప్రదేశ్ సీఈవోకి వైసీపీ నేతలు ఇవాళ ఫిర్యాదు చేశారు. ముఖ్యంగా ఓటు కోసం టీడీపీ డ్రగ్స్ పంచకుండా ఈసీని కోరాం.. దీనిపై చర్యలు తీసుకుంటామని సీఈవో కూడా చెప్పారని తెలిపారు పేర్నినాని. ఈ సందర్భంగా పేర్నినాని మీడియాలో మాట్లాడారు. చంద్రబాబు ఓటు కోసం డ్రగ్స్ పంచేందుకు తెచ్చారేమో అన్న అనుమానం ఉంది. ఇందులో  చంద్రబాబు, లోకేష్లపై విచారణ జరపాలని కోరాం.  చంద్రబాబుకి ఇతర దేశాల్లోని మాఫియాలతో అంటకాగిన చరిత్ర ఉందని..  రాజకీయాల కోసం చంద్రబాబు ఎంతకైనా దిగజారిపోతాడు అని తెలిపారు.

అదేవిధంగా చంద్రబాబు ట్వీట్ పై కూడా ఫిర్యాదు చేశామని.. అది ఎన్నికల నియమావలికి విరుద్ధమని,
తప్పుడు ఆరోపణలు చేస్తే చర్యలు తీసుకోవాలని ఈసీ నిబంధనలు ఉన్నాయి. చంద్రబాబు సతీమణి భువనేశ్వరి కూడా ఎన్నికల కోడ్ ఉల్లంఘించారు. ప్రజలను ప్రలోభ పెట్టేందుకు చెక్కులు పంచిపెట్టారు.
దాని మీద ఏం చర్యలు తీసుకున్నారో కోరామని తెలిపారు. దీనిపై  జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు ఇస్తామన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news