బీజేపీ పార్టీపై దళితుల ఆందోళన.. మీటింగుకు వస్తే 500 వందలు ఇస్తామని ఇవ్వలేదు!

-

బీజేపీ పార్టీపై దళితులు ఆందోళనకు దిగారు. మీటింగుకు వస్తే 500 వందలు ఇస్తామని ఇవ్వలేదని బీజేపీ పార్టీపై దళితులు ఆందోళనకు దిగారు. ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. సంగారెడ్డి జిల్లా హత్నూర మండలం దౌల్తాబాద్‌లో బీజేపీ వాళ్లు రఘునందన్ రావు మీటింగుకు తీసుకుపోయి తమకిస్తామన్న 500 రూపాయిలు ఇవ్వలేదని, దళితులమని చిన్న చూపు చూస్తూ బీజేపీ నాయకులు వివక్ష చూపిస్తున్నారని మండిపడ్డారు.

Dalits’ agitation against BJP party

ఇంతకుముందు ఎమ్మెల్యే ఎలక్షన్లో అన్ని పార్టీలు మందు పంచారు. బీజేపీ వాళ్లని పంచమని అడిగితే పంచకుండా మందు దాపెట్టి అమ్ముకున్నారు..మా ఓట్లు అవసరం లేదా? బీజేపీ వాళ్లు క్యాస్ట్ ఫీలింగ్ చూపిస్తున్నారు ఎస్సీల ఓట్లు కావాలని ఎస్సీ కాలనీకి బీజేపీ వాళ్లు రావొద్దని మండిపడ్డారు. తమ ఎస్సీ కాలనీకి బీజేపీ నాయకులు వస్తే చెప్పులతో కొడతామని హెచ్చరించి ఆగ్రహం వ్యక్తం చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news