నేను శూన్యం నుంచి సునామీ సృష్టించిన వ్యక్తిని: కేసిఆర్

-

ప్రస్తుతం రాష్ట్రంలోని కాంగ్రెస్ చేస్తున్న దాడిని తట్టుకోగలరా? అనే ప్రశ్నపై కేసీఆర్ స్పందించారు.ఆ విషయాన్ని తాను అసలు లెక్కలోకి తీసుకోవడం లేదని అన్నారు. మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ దాదాపు దశాబ్దకాలం తర్వాత ఓ తెలుగు న్యూస్ ఛానల్ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఆ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతు…ఒకప్పుడు ప్రధాన మంత్రి హోదాలో ఉన్న ఇందిరా గాంధీ కూడా ప్రత్యర్థులను ఏం చేయలేకపోయారని గుర్తు చేశారు. కేసీఆర్ అనే వ్యక్తి శూన్యం నుంచి సునామీ సృష్టించారని, స్వయంగా ఓ పార్టీ స్థాపించి అనుకున్న లక్ష్యాన్ని సాధించానన్నారు.

తమకు వన్ థర్డ్ సీట్లు వచ్చాయని.. ఎన్నికల్లో పెద్ద వ్యత్యాసం ఏం లేదని కేసీఆర్ తెలిపారు. ఇతరులను తిడుతూ చేసేది పాలన కాదంటూ కేసీఆర్ పేర్కొన్నారు. బజారు భాష మాట్లాడటం వేరు.. ప్రభుత్వాన్ని నడపడటం వేరు.. అంటూ పేర్కొన్న కేసీఆర్.. అలాంటి ధోరణి తమ దగ్గర లేదన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news