వైసీపీ అధికారం కోల్పోవడం పై ఉండవల్లి సంచలన వ్యాఖ్యలు

-

ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ అధికారం కోల్పోవడం పై ఎవ్వరికీ తోచిన విధంగా వారు మాట్లాడుతున్నారు. రకరకాల కారణాలు చెబుతున్నారు. ఈ కారణం వల్లనే వైసీపీ అధికారం కోల్పోయిందని పలువురు పేర్కొంటున్నారు. తాజాగా మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ రాజమండ్రిలో మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

అన్ బ్రాండెడ్ మద్యం ఎఫెక్ట్ వైసీపీ ప్రభుత్వాన్ని కుప్పకూలేలా చేసిందని ఆరోపించారు ఉండవల్లి. ఆ భారం బడుగు, బలహీన వర్గాలపై పడిందని స్పష్టం చేశారు. ఊరు పేరులేని లిక్కర్ బ్రాండ్లను మార్కెట్ లోకి తీసుకురావడం జగన్ చేసిన పెద్ద తప్పు అని పేర్కొన్నారు. టీడీపీ కూటమి విజయంతోనే నరేంద్ర మోడీ మూడో సారి ప్రధాని అయ్యారని.. చంద్రబాబు, నితీష్ కుమార్ మద్దతుతోనే కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడిందని వెల్లడించారు. ఢిల్లీలో చక్రం తిప్పేందుకు చంద్రబాబుకు ఇది సువర్ణావకాశం అన్నారు. ఏపీ ప్రయోజనాల కోసం కూటమి ఎమ్మెల్యేలు, ఎంపీలు పని చేయాలని సూచించారు ఉండవల్లి అరుణ్ కుమార్.

Read more RELATED
Recommended to you

Latest news