ఓటీటీలో ‘గం.. గం.. గణేశా’.. స్ట్రీమింగ్‌ ఎక్కడంటే?

-

ఆనంద్‌ దేవరకొండ కథానాయకుడిగా ఉదయ్‌ బొమ్మిశెట్టి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘గం.. గం.. గణేశా’. ప్రగతి శ్రీవాస్తవ, నయన్‌ సారిక హీరోయిన్లు. మే 31వ తేదీన సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. క్రైమ్‌, కామెడీ థ్రిల్లర్‌గా ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇప్పుడు సైలెంట్‌గా ఓటీటీలోకి వచ్చేసింది. ప్రముఖ ఓటీటీ వేదికగా అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో వేదికగా ప్రస్తుతం స్ట్రీమింగ్‌ అవుతోంది.’

ఇదీ గణేశ్ స్టోరీ.. : గణేశ్‌ (ఆనంద్‌ దేవరకొండ) అనాథ. స్నేహితుడి(ఇమ్మాన్యుయేల్‌)తో కలిసి చిల్లర దొంగతనాలు చేస్తూ ఉంటాడు. ప్రేమించిన అమ్మాయి శ్రుతి (నయన్‌ సారిక) డబ్బున్న వ్యక్తిని పెళ్లి చేసుకోవడానికి సిద్ధమవడంతో ఎలాగైనా తానూ ధనవంతుడు కావాలనుకుంటాడు. ఓ నగల దుకాణంలో రూ.7 కోట్ల విలువైన వజ్రాన్ని దొంగతనం చేసే డీల్‌ ఒప్పుకొని ఆ పని పూర్తి చేస్తాడు. అత్యాశకు పోయి ఆ వజ్రాన్ని తానే విక్రయించి డబ్బు సంపాదించాలనుకుంటాడు. వజ్రాన్ని చెన్నై తీసుకెళ్తుండగా పోలీసులు తనిఖీలు చేస్తుండటంతో భయపడి అటుగా వెళ్తున్న భారీ వినాయకుడి విగ్రహం తొండంలో దాన్ని పడేస్తాడు. నంద్యాల ఎమ్మెల్యే అభ్యర్థి కిషోర్‌రెడ్డి (రాజ్‌ అర్జున్‌) ఆర్డర్‌ మేరకు ఆ వినాయకుడి విగ్రహాన్ని ముంబయిలో ప్రత్యేకంగా తయారుచేయించి, ఊరికి తీసుకొస్తుంటాడు కిరాయి రౌడీ రుద్ర (కృష్ణ చైతన్య). అయితే, కిషోర్‌రెడ్డి ఊరికి వెళ్లాల్సిన ఆ విగ్రహం కాస్తా తన ప్రత్యర్థి రాజకీయ నాయకుడు ఉన్న రాజావారిపల్లెకు వెళ్తుంది. ఇంతకీ ఆ విగ్రహంలో ఏముంది? కిషోర్‌రెడ్డి ప్రత్యేకంగా ఆ విగ్రహాన్ని తయారు చేయించడం వెనుక కారణం ఏంటి? వినాయకుడి విగ్రహంలో ఉండిపోయిన ఆ వజ్రాన్ని గణేశ్‌ ఎలా తిరిగి సంపాదించాడు? అన్నది చిత్ర కథ.

Read more RELATED
Recommended to you

Latest news