జాతీయ జెండాను చేతపట్టని వాడు భారతీయుడే కాదని బండి సంజయ్ హాట్ కామెంట్స్ చేశారు. జాతీయవాద భావజాలంతో ప్రతి ఒక్కరూ పనిచేయాలని.. నేటి నుండి పంద్రాగస్టుదాకా ప్రతి ఒక్కరి ఫోన్ వాట్సప్ లో మువ్వెన్నెల జెండాను డీపీలుగా పెట్టండి అంటూ పిలుపునిచ్చారు. కరీంనగర్ లోని టవర్ సర్కిల్ వద్ద ‘హర్ ఘర్ తిరంగా’ యాత్రలో బండి సంజయ్ హాట్ కామెంట్స్ చేశారు. నెహ్రూ అమలు చేసిన బానిసత్వ మరకలను తుడిచివేయాలి… అంబేద్కర్ గొప్ప రాజ్యాంగం అందిస్తే… రాజకీయ లబ్ది కోసం కాంగ్రెస్ అనేక పాపాలను యాడ్ చేసిందని తెలిపారు.
మైనారిటీ సంతూష్టీకరణ విధానాలే దేశ అనిశ్చితికి కారణమని… అంబేద్కర్ గొప్ప రాజ్యాంగాన్ని అందిస్తే… అందులో కాంగ్రెస్ అనేక పాపాలను జత చేసిందని తెలిపారు. కాంగ్రెస్ చేసిన పాపాలను బీజేపీ కడిగే పని చేస్తే తప్పుపడతారా? వక్ఫ్ బోర్డు బిల్లుకు నెహ్రూ, పీవీ, మన్మోహన్ హయాంలో సవరిస్తే తప్పులేదటఅన్నారు. ఆ తప్పులను సరిదిద్దేందుకు మోదీ వక్ఫ్ బోర్డు సవరణ బిల్లు తెస్తే తప్పుపడతారా? అని ప్రశ్నించారు. మతం పేరుతో వక్ఫ్ బోర్డు సవరణ బిల్లును అడ్డుకునేందుకు కాంగ్రెస్ కుట్ర అన్నారు. పంద్రాగస్టున జెండా, ఎజెండాను పక్కనపెట్టి మువ్వెన్నెల జెండాను ప్రతి ఇంటిపై ఎగరేయండని కోరారు.