ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏం మాట్లాడుతున్నారో అర్థం కావడం లేదు.. ఎమ్మెల్సీ తాతా మధు స్ట్రాంగ్ కౌంటర్

-

కేసీఆర్ కమీషన్ల కోసమే డిజైన్లు మార్చారు.. ప్లేస్ మార్చారు అని మంత్రి ఉత్తమ్ నిన్న పేర్కొన్న విషయం తెలిసిందే. తాజాగా ఎమ్మెల్సీ తాతా మధు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు.  మీరు డిజైన్ చేసిన రాజీవ్ సాగర్ వేలేరుపాడులో ఉంది. ఇప్పుడు ఆ వేలేరుపాడు ఆంధ్రలో ఉంది. తెలంగాణ ప్రభుత్వం ఆంధ్రాలో వెళ్లి ప్రాజెక్టు కట్టదు కదా? అని ప్రశ్నించారు.  కాంట్రాక్టర్లతో కుమ్మక్కై ప్రాజెక్టు కాస్ట్ పెంచారు అని మాట్లాడుతున్నారు.

మీరు ప్రాజెక్ట్ డిజైన్ చేసినప్పుడు అక్కడ భూమి విలువ ఎంత?  స్టీల్, సిమెంటు కాస్ట్ ఎంత? లాండ్ ప్రొక్యూర్మెంట్ ఎంత రేటు పెరిగింది? పాలేరు భక్తురామదాసు ప్రాజెక్టు కట్టకముందు ల్యాండ్ రేటు రూ. 50 వేలు, రూ.60 వేలు ఉండేది ఇవ్వాలా ఆ రేటుకి ఎవరైనా ఇస్తారా? అని ప్రశ్నించారు.  ఇవాళ రూ. 25 లక్షల  తక్కువ పాలేరులో ఎక్కడ ల్యాండ్ లేదు. సీతారామ ప్రాజెక్టుకి అన్ని పర్మిషన్లు మేమే తెచ్చామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతున్నారు. అతను సోయి ఉండి మాట్లాడుతున్నారో, సోయలేక మాట్లాడుతున్నారో అర్థం కావడం లేదు అని కౌంటర్ ఇచ్చారు ఎమ్మెల్సీ తాతా మధు.

Read more RELATED
Recommended to you

Latest news