రేవంత్ రెడ్డి మొగోడు కాదు, మోసగాడు : హరీశ్ రావు

-

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మొగోడు కాదు.. మోసగాడు అని మాజీ మంత్రి హరీశ్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇవాళ మహబూబాబాద్ జిల్లా తొర్రూల్ లో రైతులు చేపట్టిన ధర్నాలో పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. హైదరాబాద్ మహానగరంలో చెరువుల సంరక్షణ పేరుతో హైడ్రా విధ్వంసం  సృష్టిస్తోందని ఆరోపించారు. అన్ని వసతులు ఉన్నప్పటికీ కక్ష పూరితంగా ప్రభుత్వం నిరుపేదల ఇళ్లను బుల్డోజర్లతో నేలమట్టం చేస్తున్నారని మండిపడ్డారు. 

ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు రాష్ట్రవ్యాప్తంగా రైతు రుణమాఫీని భేషరతుగా అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఉపాధి హామీ పథకాన్ని వ్యవసాయానికి అనుసంధానం చేస్తానని చెప్పిన మాటలు ఏమయ్యాయని ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన రైతు డిక్లరేషన్ లో ఏ ఒక్క  హామీ అమలు కాలేదన్నారు. రాష్ట్రంలో రౌడీ రాజ్యం అమలు అవుతుందని ఆయన ఫైర్ అయ్యారు. 

Read more RELATED
Recommended to you

Latest news