సీఎం రేవంత్ రెడ్డి పై కూడా పరువు నష్టం దావా వేస్తాను : కేటీఆర్

-

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పై కూడా పరువు నష్టం దావా వేస్తానని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు. కందుకూరులో నిర్వహించిన రైతుల ధర్నాలో పాల్గొని మీడియాతో మాట్లాడారు. లక్షయాబై వేల కోట్లు మూసీకి ఖర్చు పెడుతున్నాడు. డబ్బు మూటలు ఢిల్లీకి పంపించేందుకు మూసీ సుందరీకరణ అన్నారు కేటీఆర్. ఎన్నికల ముందు రేవంత్ రెడ్డి అడ్డగోలు హామీలు ఇచ్చారు. ఇప్పుడు ముఖ్యమంత్రి పదవీని కాపాడుకునే పనిలో ఉన్నారు. మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలపై పరువు నష్టం దావా వేశానని.. సీఎం రేవంత్ రెడ్డి పై కూడా పరువు నష్టం దావా వేస్తానని పేర్కొన్నారు కేటీఆర్.

నా పైన ఇష్టం వచ్చినట్లు గబ్బు మాటలు ముఖ్యమంత్రి , మంత్రులు మాట్లాడుతున్నారు. తప్పు చేయనప్పుడు మేము ఎందుకు బయపడుతాం. మోడీ లాంటి వాడికే భయపడలేదు రేవంత్ రెడ్డి ఎంత. భారత ప్రధాని నరేంద్ర మోడీతోనే పోరాడాం.. చిట్టినాయుడు ఎంత అని సెటైర్లు వేశారు కేటీఆర్. హైడ్రా పేరుతో పేదల ఇండ్లు కూల్చుతున్నారు. మా మీద కోపం ఉంటే మా ఇండ్లు కూల్చoడి.. పేదల దగ్గరకు రావద్దు అని సూచించారు కేటీఆర్.

Read more RELATED
Recommended to you

Latest news