వైరల్ వీడియో; తమను కొట్టిన పోలీసులకు అన్నం పెట్టిన రైతులు…!

-

ఆంధ్రప్రదేశ్ రైతులు చేస్తున్న పోరాటం గురించి ఎంత చెప్పినా తక్కువే. భూములు ఇచ్చిన రైతులు తమ భవిష్యత్తు కోసం పెద్ద ఎత్తున పోరాటం చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఆ పోరాటం ఒక ఎత్తు అయితే పోలీసులు వారిపై చేస్తున్న దాడులు వివాదాస్పదంగా మారాయి. ముఖ్యంగా పై అధికారుల ఆదేశాలతో కింది స్థాయి అధికారులు పదే పదే వారిపై దాడులు చేస్తూ చిత్ర హింసలకు గురి చేస్తున్నారు.

ఇటీవల జాతీయ రహదారి దిగ్బంధనం అంటూ రైతులు పోరాటం చేసారు. అక్కడ రైతులు వండుకున్న ఆహారంలో కొంత మంది ఇసుక పోశారు. అలాగే వండుకున్న వంటలను కూడా ఎత్తుకుపోయారు. పోలీసుల కాళ్ళు కూడా పట్టుకున్నారు అమరావతి రైతులు. ఇప్పుడు ఆ రైతులే అవేమి పట్టించుకోకుండా, పొలీసులకు మానవత్వంలో అన్న౦ పెడుతున్న వీడియో ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

స్వయానా చంద్రబాబు నాయుడు తన ఫేస్ బుక్ ఎకౌంట్లో ఈ వీడియోను పోస్టు చేస్తూ కామెంట్ పెట్టారు. “వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆర్డర్ వేస్తే లాఠీతో కొట్టిన పోలీసులకు అన్నం పెట్టే మానవత్వానికి నిలువెత్తు నిదర్శనం అయ్యాడు రైతు” అని చంద్రబాబు పోస్ట్ చేసారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. రైతు అమ్మా ఇద్దరూ ఒకటే అని, వాళ్ళకు ఆకలి తెలుసు కాబట్టే అన్నం పెట్టారు అంటూ వ్యాఖ్యానిస్తున్నారు పలువురు.

YS Jagan Mohan Reddy ఆర్డర్ వేస్తే లాఠీతో కొట్టిన పోలీసు సోదరులకు అన్నం పెట్టి… మానవత్వానికి నిలువెత్తు నిదర్శనం అయ్యాడు రైతు! జై అమరావతి! #MyCapitalAmaravati

Posted by Nara Chandrababu Naidu on Friday, 10 January 2020

Read more RELATED
Recommended to you

Latest news