పుష్ప-2 తెలుగు రాష్ట్రాల డిస్ట్రిబ్యూటర్స్ వీరే..!

-

ఐకాన్  స్టార్ అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన పుష్ప సినిమాకు కొనసాగింపుగా పుష్ప 2 సినిమా రానున్న విషయం తెలిసిందే. అల్లు అర్జున్ సరసన నేషనల్ క్రష్ రష్మిక నటిస్తోంది. 2021 తర్వాత బన్నీని స్క్రీన్ పై చూడలేదు ఫ్యాన్స్. దీంతో పుష్ప 2 కోసం అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఇటు టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్, శాండల్ వుడ్, మాలీవుడ్ ప్రేక్షకులు ఈ సినిమా కోసం ఎదురు చూస్తున్నారు. ఈ చిత్రం నుండి ఏ కంటెంట్ రిలీజైన నేషనల్ లెవల్ లో వైరల్ గా మారుతున్నాయి.

pushpa-2

తాజాగా ఈ చిత్ర థియేట్రికల్ రైట్స్ అమ్మకాల స్టార్ట్ చేసారు మేకర్స్.  కొన్ని ఏరియాలు రెగ్యులర్ డిస్ట్రిబ్యూటర్స్ దక్కించుకోగా.. మరికొన్ని ఏరియాలు ఇతరులు రంగంలోకి దిగారు. ఆంధ్రలోని మెయిన్ ఏరియా ఉత్తరాంధ్ర – సాయి కొర్రపాటి, పశ్చిమ గోదావరి – LVR పిక్చర్స్, తూర్పు గోదావరి – మైత్రీ మూవీస్ సొంతంగా రిలీజ్ చేస్తుంది. ఇక కృష్ణ జిల్లాను గీత ఆర్ట్స్ – 2 అధినేత బన్నీ వాసు దక్కించుకున్నారు. గుంటూరు ఏరియాకు UV క్రియేషన్స్ నిర్మాత వంశీ కొనుగోలు చేసారు. నెల్లూరుకు మైత్రీ రెగ్యూలర్ డిస్ట్రిబ్యూటర్ అంజలి పిక్చర్స్ భాస్కర్ రెడ్డి పుష్ప -2 రైట్స్ ను సొంతం చేసుకున్నారు. ఇక ఏపీలోని మరొక కీలకమైన రాయలసీమ ఏరియాను అభిషేక్ రెడ్డి రూ. 30 కోట్లకు పుష్ప -2 రైట్స్ తీసుకున్నారు.  తెలంగాణ ఏరియా మైత్రీ సంస్థకు సొంత డిస్ట్రిబ్యూషన్ ఉంది. నైజాం లో మైత్రీ మూవీస్ ద్వారా రిలీజ్ కానుంది పుష్ప-2. డిసెంబర్ 6న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది.

Read more RELATED
Recommended to you

Latest news