ప్రపంచ దేశాలు భారత వృద్ధిని చూసి ఆశ్యర్యపోతున్నాయి.. కేంద్ర మంత్రి ఆసక్తికర వ్యాఖ్యలు

-

ఆంధ్రప్రదేశ్ సీఎం నారా  చంద్రబాబు నాయుడు, దేశ ప్రధాని నరేంద్ర మోడీపై టీడీపీ నేత, కేంద్ర పౌర విమానయాన శాఖా మంత్రి కింజరపు రామ్మోహన్ నాయుడు ప్రశంసల వర్షం కురిపించారు. ఇద్దరూ అద్భుతమైన నేతలని, అహర్నిశలు శ్రమించే తత్వం ఉన్న నాయకులని కొనియాడారు. మంగళవారం మీడియాతో మాట్లాడిన ఆయన ఏపీ సీఎం చంద్రబాబునాయుడు గురించి మాట్లాడుతూ.. ఆయన ఎప్పుడూ కొత్త ఆలోచనలు చేస్తుంటారని, ఆయన యువతతో పోటీపడి చంద్రబాబు పని చేస్తుంటారని, సాంకేతికత వినియోగంపై చర్చలు జరుపుతుంటారని అన్నారు.

అనంతరం దేశ ప్రధాని నరేంద్ర మోడీ గురించి మాట్లాడుతూ.. దేశాభివద్ధి కోసం అనునిత్యం ఆలోచించే వ్యక్తి ప్రధాని నరేంద్ర మోడీ అని కొనియాడారు. ప్రస్తుతం భారతదేశం అభివృద్ధిలో
దూసుకుపోతోందని, ప్రపంచ దేశాలు సైతం భారత్ వృద్ధిని చూసి ఆశ్చర్యపోతున్నాయని రామ్మోహన్ నాయుడు అన్నారు. గత పదేళ్లలో దేశంలో ఎయిర్పోర్టుల సంఖ్య 157కు పెరిగిందని, విమానాల్లో ప్రయాణికుల సంఖ్య కూడా పెరిగిందని, భవిష్యత్తుల్లో విమానయాన శాఖను మరింత వృద్ధి సాధించే విధంగా  చేయడమే తన ధ్యేయమని పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news