పోచారం శ్రీనివాస్ రెడ్డి లాంటోడిని కాంగ్రెస్ లోకి తీసుకొచ్చారు – జీవం రెడ్డి ఫైర్

-

కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. పోచారం శ్రీనివాస్ రెడ్డి లాంటోడిని పార్టీలోకి తీసుకొని ప్రభుత్వ సలహాదారు పదవి ఇచ్చారని నిలదీశారు. పోచారం శ్రీనివాస్ రెడ్డి పార్టీ ఫిరాయింపులకు సలహాలు బాగా ఇస్తాడని చురకలు అంటించారు కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి.

mlc jeevan reddy slams ponguleti srinivas

పార్టీ ఫిరాయించిన 10 మంది ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో కాంగ్రెస్ కార్యకర్తలు ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. గంపగుత్తగా 10 మంది ఎమ్మెల్యేలను వేరే పార్టీలో నుండి తీసుకొని ప్రభుత్వాన్ని నడపాలా? అని నిలదీశారు కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి. అటు రేవంత్ రెడ్డి మీద జీవన్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు.

అభివృద్ధి పేరిట రేవంత్ రెడ్డి పార్టీ ఫిరాయింపుల ప్రోత్సహిస్తున్నారన్నారు కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి.  ప్రతిపక్షాలను బతకనిస్తారా లేదా అని ఆగ్రహించారు. అభివృద్ధి జరగాలంటే అధికార పార్టీలో చేరాలని రూల్ ఉందా.. ఇలాగే కొనసాగితే ప్రజాస్వామ్యం బతుకుతుందా.. ప్రతిపక్షాలు బతుకుతాయా ? అని పేర్కొన్నారు కాంగ్రెస్ జీవన్ రెడ్డి.

Read more RELATED
Recommended to you

Latest news