త్రివిక్రమ్ వలన ఆమెకు నష్టం జరిగిందా…..??

-

టాలీవుడ్ సినిమా పరిశ్రమకు మొదట స్వయంవరం, చిరునవ్వుతో వంటి సినిమాలకు కథ, మాటల రచయితగా అడుగుపెట్టిన త్రివిక్రమ్ శ్రీనివాస్, ఆ తరువాత పలు సినిమాలకు కథ, మాటలు అందించి మంచి పేరు దక్కించుకున్నాడు. ఆపై కొద్దిరోజులకు తరుణ్, శ్రియ ల కాంబోలో వచ్చిన నువ్వే నువ్వే సినిమాతో తొలిసారిగా దర్శకుడిగా మారిన త్రివిక్రమ్, ఆ సినిమాతో మంచి విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు. ఆ తరువాత మహేష్ బాబు తో అతడు, పవన్ కళ్యాణ్ తో జల్సా, బన్నీ తో జులాయి వంటి సక్సెస్ఫుల్ సినిమాలు తీసిన త్రివిక్రమ్, మధ్యలో కొన్ని ఫ్లాప్స్ కూడా అందుకోవడం జరిగింది.

ఇక ఇటీవల సంక్రాంతి కానుకగా స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కిన అలవైకుంఠపురములో వంటి సక్సెస్ఫుల్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన త్రివిక్రమ్, ప్రస్తుతం ఆ సినిమా సక్సెస్ ని ఎంజాయ్ చేస్తున్నాడు. ఇకపోతే ఈ సినిమాలో నటించిన సీనియర్ నటి టబు విషయమై త్రివిక్రమ్ చేసిన ఒక పని వలన ఆమెకు నష్టం జరిగిందని అంటున్నారు. నిజానికి టబు కు అంతపెద్ద వయసేమీ లేదనే విషయం అందరికీ తెలిసిందేనని, అయినప్పటికీ బన్నీకి తల్లిగా నటించిన ఆమె పాత్రకు ఉండాల్సిన హుదాతనం, అలానే మేకప్ విషయమై సరైన శ్రద్ధ తీసుకోకపోవడం వలన సినిమాలో ఆమెకు పెద్దగా గుర్తింపు రాలేదని అంటున్నారు.

 

వాస్తవానికి సినిమా క్రెడిట్ లో చాలావరకు మురళి శర్మ, సుశాంత్, నివేత లకు దక్కినప్పటికీ, ఎక్కడా కూడా టబు పేరు వినపడకపోవడానికి ఆమె పాత్ర విషయమై శ్రద్ధ తీసుకోకపోవడమే కారణం అని అంటున్నారు. గతంలో పవన్ కళ్యాణ్ హీరోగా త్రివిక్రమ్ తెరకెక్కించిన అత్తారింటికి దారేది సినిమాలో అత్త పాత్రలో నటించిన నదియాను ఎంతో హుందాగా, గొప్పగా చూపించిన త్రివిక్రమ్, ఈ సినిమా విషయమై టబుకు పేరు రాకపోవడానికి పూర్తి కారకుడు ఆయనే అని అంటున్నారు……!!

Read more RELATED
Recommended to you

Latest news