పోలీసుల సాక్షిగా ఒక్కటైన ప్రేమ జంట.. ఎలాగో తెలుసా..?

-

సాధారణంగా పోలీస్‌స్టేషన్లలో వాతావరణం ఎలా ఉంటుంది? పోలీసులు తమతమ విధుల్లో బిజీబిజీగా ఉంటారు. ఫిర్యాదుదారుల నుంచి కంప్లెయింట్లు తీసుకోవడం.. దోపిడీ, దొంగతనం కేసుల్లో పట్టుబడ్డ నిందితులను ఇంటరాగేట్‌ చేయడం, ఇంటరాగేషన్‌ పూర్తయిన వారిని కోర్టుల్లో హాజరుపర్చడం ఇలా రకరకాల పనులతో అంతా హడావిడిగా ఉంటారు.

కానీ ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రం, లక్నోలోని ఓ మహిళా పోలీస్‌స్టేషన్లో మాత్రం సోమవారం ఇందుకు భిన్నమైన దృశ్యం కనిపించింది. పోలీసులు ఓ ప్రేమజంటకు రెండు వైపుల బంధువులు తామే అయ్యి పెండ్లి జరిపించారు. లక్నో నగర పోలీస్‌ కమిషనర్‌ పర్యవేక్షణలో ఈ పెండ్లి జరిగింది.

అసలేం జరిగిందంటే.. లక్నోకు చెందిన మనీష్‌, కిరణ్మయి ప్రేమికులు. ఈ విషయం కిరణ్మయి ఇంట్లో తెలిసి తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. పెండ్లిగిండ్లి అంటే చంపుతామని బెదిరించారు. దీంతో కిరణ్మయి మనీష్‌తో కలిసి లక్నో పోలీస్‌ కమిషనర్‌ను ఆశ్రయించింది. కిరణ్మయి, మనీష్‌ నుంచి అన్ని వివరాలు అడిగి తెలుసుకున్న నగర కమిషనర్‌.. వారికి పెండ్లి జరిపించాలని మహిళా పోలీస్‌స్టేషన్‌ సిబ్బందిని ఆదేశించారు. దీంతో పోలీసులు ఆ జంటకు పెండ్లి చేసి ఆశీర్వదించారు.

Read more RELATED
Recommended to you

Latest news