జగన్ నాయకత్వం బొ…లో నాయకత్వం అన్న ఎంపీ…!

-

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో నర్సాపురం ఎంపీ కనుమూరి రఘురామ కృష్ణం రాజు కి ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన ఎం మాట్లాడినా దానికి ప్రాధాన్యత ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా ఆయన ప్రసంగాలను ఇతర రాజకీయ పార్టీలు కూడా వింటూ ఉంటాయి. సొంత పార్టీలో జగన్ కి ఆయన కంట్లో నలుసుగా ఉన్నారు. వైసీపీ ద్వారా రాజకీయ రంగ ప్రవేశం చేసిన ఆయన… అదే వైసీపీని విభేదించి, ఇప్పుడు మళ్ళీ అదే పార్టీ నుంచి ఎంపీగా విజయం సాధించారు.

ఆయన బిజెపిలోకి వెళ్ళే అవకాశం ఉందనే ప్రచారం జరుగుతుంది. పార్లమెంట్ లో ఆయన మాట్లాడే ప్రతీ మాటకు కాస్త ప్రాధాన్యత ఉంటుంది. ఇది పక్కన పెడితే ఇప్పుడు ఆయన కొన్ని సంచలన వ్యాఖ్యలు చేసారు. బొచ్చులో నాయకత్వం ఎవడికి కావాలంటూ తాజాగా మీడియాతో మాట్లాడుతూ అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లాలోని ఓ మార్కెట్ యార్డ్ ఛైర్మన్ ఎంపిక విషయంలో… విభేదాలు తలెత్తగా ఆయన వాటిని పరిష్కరించారు.

అందరం మంత్రి మోపిదేవితో చర్చించి ఏకాభిప్రాయంతో ఛైర్మన్ ఎంపిక ప్రక్రియను పూర్తి చేస్తామని చెప్తుండగా… జై జగన్, జగన్ నాయకత్వం వర్దిల్లాలి, రఘురామ కృష్ణం రాజు నాయకత్వం వర్దిల్లాలని అరుస్తుండగా… రఘురామకృష్ణంరాజుకు ఒక్కసారిగా కోపం వచ్చి… ఎవడి నాయకత్వం కావాలి.. బొచ్చులో నాయకత్వం, నోరు మూసుకు కూర్చోవాలని సూచించారు. ఈ వీడియో వైరల్ అవుతుంది.

Read more RELATED
Recommended to you

Latest news