పూర్తి ఆరోగ్యం బాగుండాలంటే సరైన ఆహారంతో పాటుగా మంచినీరును తీసుకోవడం కూడా ఎంతో అవసరం. ఆహారం, నీటిని తీసుకోవడంతో పాటుగా సరైన సమయానికి తీసుకోవడం కూడా ఎంతో కీలకమైన విషయం. మంచినీరును తీసుకోవడంలో కొన్ని నియమాలను పాటిస్తే ఆరోగ్యం మరింత మెరుగవుతుంది. ప్రతిరోజూ నిద్ర లేచిన వెంటనే చాలా మంది మంచినీరును తీసుకుంటారు. దాని వలన ఎన్నో ప్రయోజనాలను పొందవచ్చు. ముఖ్యంగా, ఒకటి లేదా రెండు గ్లాసుల గోరువెచ్చని నీటిని ఉదయాన్నే తీసుకోవడం వలన శరీర ఆరోగ్యం బాగుంటుంది. ఎప్పుడైతే గోరువెచ్చని నీటిని తాగుతారో, అప్పుడు శరీరంలోని మలవిసర్జన సరిగ్గా జరుగుతుంది.
చాలా శాతం మంది ఆహారంతో పాటుగా నీటిని తీసుకుంటూ ఉంటారు. అయితే ఇది ఆరోగ్యానికి మంచిది కాదు. ముఖ్యంగా భోజనం చేయడానికి అరగంట ముందే కొంచెం నీటిని తీసుకోవాలి. ఇలా చేయడం వలన జీర్ణక్రియ చురుగ్గా మారుతుంది. భోజనం చేసిన వెంటనే ఎక్కువగా నీటిని తీసుకోవడం మంచిది కాదు. భోజనం చేసేటప్పుడు మంచి నీటిని తాగాలంటే కొంచెం కొంచెంగా తీసుకోవాలి, దీని వలన ఆహారం త్వరగా జీర్ణమవుతుంది. వ్యాయామం చేసేవారు సహజంగా త్వరగా అలసిపోతారు, దానివలన మంచినీరును ఎక్కువగా తీసుకోవడం వలన వ్యాయామం ఫలితాన్ని పొందలేరు.
అయితే, వ్యాయామం చేసిన వెంటనే మంచినీరును ఎక్కువగా తాగడం మేలుకాదు. కనుక, వ్యాయామం చేసిన తరువాత నీటిని తాగాలంటే నెమ్మదిగా, కొంచెం మోతాదులో తీసుకోవాలి. మహిళలు పీరియడ్స్ సమయంలో గోరువెచ్చని నీటిని తాగడం వలన ఎంతో ప్రయోజనం ఉంటుంది. కడుపు నొప్పి, తిమ్మిరి వంటి సమస్యలను తగ్గించేందుకు గోరువెచ్చని నీటిని తాగడం మంచిది. అలాగే, నిద్రపోయే ముందు మంచినీరును తీసుకోవడం వలన శరీరానికి తగిన హైడ్రేషన్ అందుతుంది. పైగా నిద్రలో అంతరాయం రాకుండా సహాయపడుతుంది. కనుక, ఇటువంటి నియమాలను పాటిస్తూ మంచినీరును సరైన విధంగా తీసుకోవడం వలన పూర్తి ఆరోగ్యం బాగుంటుంది.