శీతాకాలంలో పండించే కూరగాయల సాగులో తీసుకోవాల్సిన జాగ్రత్తలు..!!

-

ప్రస్తుతం శీతాకాలం కొనసాగుతున్న సంగతి తెలిసిందే..కొన్ని కూరగాయల సాగుకు ఈ కాలం అనుకూలమైనది.. ఈ కాలంలో ముఖ్యంగా దుంపజాతి కూరగాయలు, క్యాబేజీ, కాలీఫ్లవర్ , టమాట, మిరప, వంట వంటి పంటలను సాగుకు అనుకూలంగా ఉంటాయి. రైతులకు అధిక ఆదాయాన్ని సమకూరుస్తాయి. ఈ సీజన్ లో దిగుబడులు కూడా అధికంగా ఉంటాయని వ్యవసాయ నిపుణులు చెబుతున్నారు.

శీతాకాలంలో నీటి సౌకర్యం ఉంటేనే సాగు చేపట్టాలి. చీడ, పీడలను తట్టుకుని దిగుబడినిచ్చే రకాలను ఎంపిక చేసుకోవటం మంచిది. ఆయా ప్రాంతాల్లో సాగుకు అనుకూలంగా ఉండే వంగడాలనే వాడాలి. రబీలో చలి ఎక్కువగా ఉండటం వల్ల సూక్ష్మధాతు పోషకాలు లోపించే అవకాశాలు ఎక్కువ. కాబట్టి సూక్ష్మధాతు ఎరువులను సిద్థం చేసుకోవాలి. కూరగాయల సాగులో హైబ్రీడ్‌ విత్తనాల వల్ల దిగుబడులు పెరుగుతాయి.నాణ్యత లేని విత్తనాలు మార్కెట్‌లో ఉండే అవకాశం ఉంది. కాబట్టి విత్తనాలు కొనేటప్పుడు మాత్రం కాస్త జాగ్రత్త తీసుకోవాలి..

ఇకపోతే వంగ, మిరప, టమాటలో నారు కుళ్లు తెగులు అధికంగా ఉంటుంది. దీంతో మొక్కలు ఎక్కువగా చనిపోతాయి. ఇది నీటి ద్వారా ఇతర నారు మొక్కలకు కూడా సోకి అన్ని చనిపోతాయి. కనుక ఎత్తైన నారుమడులు తయారు చేసుకుని నారు పెంచుకోవాలి. ఎకరంలో నాటడానికి సరి పోయే విత్తనం పెంచడానికి నాలుగు మీటర్ల పొడవు, మీటరు వెడల్పు ఉన్న నారు మడులు 8 నుంచి 10 కావాలి. వీటిని భూమిపై నుంచి 15 సెం. మీటరు ఎత్తులో ఉండేలా తయారు చేయాలి.అలా చేస్తే నారులో నీరు నిల్వదు..

విత్తన మొలక శాతం పరీక్షించిన తర్వాతే నారుమడులు పెంచుకోవాలి. విత్తనాల్లో మొలక శాతం 70 శాతం కంటే ఎక్కువగా ఉండాలి. గింజలను పేపర్‌లో వరుసగా ఒకదాని పక్కన మరొకటి పెట్టి పేపరు చుట్టాలి..అప్పుడు విత్తనాల మొలకను బట్టి విత్తుకోవాలి.. ముఖ్యంగా విత్తన శుద్ధి చెయ్యడం తప్పనిసరి.. మరింత సమాచారం కొరకు దగ్గరలోని వ్యవసాయ నిపుణుల సలహా తీసుకోవడం మంచిది..

Read more RELATED
Recommended to you

Latest news