వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి ఎంగేజ్మెంట్ లో పవన్ కళ్యాణ్.. ఫొటోస్ వైరల్

-

టాలీవుడ్ యాక్టర్లు వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి ఓ ఇంటి వారు కాబోతున్న విషయం తెలిసిందే. గత కొద్ది రోజులుగా వస్తున్న సందేహాలకు చెక్ పెడుతూ లావణ్య త్రిపాఠి, వరుణ్ తేజ్ ఏడు అడుగులు వేసేందుకు సిద్ధమయ్యారు. హైదరాబాద్ లోని నాగబాబు నివాసంలో జూన్ 9వ తేదీన రాత్రి వీరి ఎంగేజ్మెంట్ ఘనంగా జరిగింది.

ఈ వేడుకకు మెగా కుటుంబ సభ్యులు అందరూ హాజరయ్యారు. మెగా ఫ్యామిలీతో పాటు అల్లు కుటుంబం, లావణ్య కుటుంబ సభ్యులు మాత్రమే హాజరయ్యారు. చిత్ర ప్రముఖులకు ఎలాంటి పిలుపు లేదు. అయితే తాజాగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వరుణ్ తేజ్, జంటను ఆశీర్వదించిన ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

లావణ్య కు బొకే అందజేసిన పవన్ కళ్యాణ్ శుభాకాంక్షలు తెలియజేశారు. ఆ తర్వాత వరుణ్ తేజ్ తో కాసేపు ముచ్చటించి.. కొత్తజంటతో పాటు తన అన్నయ్య నాగబాబు దంపతులతో ఫోటో దిగారు.

Read more RELATED
Recommended to you

Latest news