అనుష్క పేరుతో నిర్మాతలకు రూ.51 లక్షలు మోసం.. ఏమైందంటే..?

-

సాధారణంగా సినీ ఇండస్ట్రీలో సినీ తారల పేర్లు చెప్పి కొంతమంది నిర్మాతలను మోసం చేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పుడు తాజాగా అనుష్క పేరుపై కూడా భారీ మోసం జరిగింది.. కింగ్ నాగార్జున హీరోగా తెరకెక్కిన సూపర్ సినిమాతో ఇండస్ట్రీకి పరిచయమైన అనుష్క.. ఆ తర్వాత బ్యాక్ టు బ్యాక్ అవకాశాలను అందుకుంటూ.. స్టార్ హీరోలతో సినిమాలు చేసి తన రేంజ్ పెంచుకుంది. ముఖ్యంగా బిల్లా వంటి సినిమాలలో బికినీలు కూడా ధరించి అలరించిన ఈమె అరుంధతి సినిమా ద్వారా తన రాజసం చూపించింది. ఆ తర్వాత బాహుబలి సినిమాతో పాన్ ఇండియా హీరోయిన్ అయిపోయిన ఈమె తెలుగుతోపాటు తమిళ్లో కూడా సినిమాలు చేసింది.

చివరిగా నిశ్శబ్దం సినిమాలో ప్రేక్షకుల ముందుకు వచ్చి ఆకట్టుకుంది. అయితే ఈ సినిమా ప్రేక్షకులను అలరించలేక పోయింది. ఇప్పుడు యంగ్ హీరో నవీన్ పోలిశెట్టితో కలిసి సినిమా చేస్తోంది. ఇదిలా ఉండగా అనుష్కకు సంబంధించిన ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చాలా వైరల్ గా మారింది. సినిమా తారల పేర్లు చెప్పి కొంతమంది జాదూగాళ్లు డబ్బులు వసూలు చేయడం ఇప్పుడు అనుష్క విషయంలో కూడా జరిగింది. అనుష్క పేరుతో పెద్ద మోసం జరిగిందని చెప్పవచ్చు.

హీరోయిన్ అనుష్క సంగీత దర్శకుడు మణిశర్మల అపాయింట్మెంట్ ఇప్పిస్తానని చెప్పి విశ్వకర్మ క్రియేషన్స్ అధినేత నిర్మాత లక్ష్మణ్ చారిని ఎల్లారెడ్డి అనే వ్యక్తి మోసం చేశాడు. అతని దగ్గర నుంచి ఏకంగా రూ.51 లక్షలు వసూలు చేసి అనుష్క, మణిశర్మల అపాయింట్మెంట్లు ఇప్పిస్తానని చెప్పాడు. అయితే ఇప్పటివరకు తన జాడ కనిపించలేదు. మోసపోయానని తెలుసుకున్న నిర్మాత లక్ష్మణ్ చారి ఫిలిం చాంబర్లో ఫిర్యాదు చేశాడని సమాచారం. ఏదేమైనా నిర్మాతలు సినీ తారల అపాయింట్మెంట్ విషయంలో పలు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించినట్లు సమాచారం.

Read more RELATED
Recommended to you

Latest news