ప్రభాస్‌ ఫ్యాన్స్‌ ను చూస్తే.. జాలేస్తుంది !

-

నిన్న ఐమాక్స్ థియేటర్ వద్ద ఆదిపురుష్ సినిమా బాగాలేదన్నందుకు ఫ్యాన్స్ ఓ యువకుడిపై దాడి చేసిన విషయం తెలిసిందే. దాని తర్వాత అతడు మీడియాతో మాట్లాడారు. ‘నేను కావాలని ట్రోల్ చేస్తున్న అనుకుంటున్నారు.

ఉన్నది ఉన్నట్లు చెబితే ఫ్యాన్స్ జీర్ణించుకోలేకపోయారు. ఆ ఫ్రస్టేషన్ నా మీద తీర్చుకున్నారు. వాళ్లపై కోపం రావట్లేదు. జాలి వేస్తోంది. ప్రభాస్ కు ఈ విషయం తెలిసి నన్ను ఇంటికి పిలిస్తే సంతోషం అని’ చెప్పారు.

ఇక అటు ఆది పురుష్ డైరెక్టర్ ఓం రౌత్ పై నెటిజన్లు ట్రోల్స్ చేస్తున్నారు. #OmRaut హ్యాష్ ట్యాగ్ ట్రెండ్ అవుతుంది. ప్రభాస్ లాంటి స్టార్ ను సరిగ్గా వినియోగించుకోలేకపోయారని.. రామాయణాన్ని మార్చేశారని, కొన్ని సీన్లు కామెడీగా ఉన్నాయని పోస్టులు చేస్తున్నారు. రూ. 100 కోట్లతో కార్టూన్ సినిమా తీశారు అంటున్నారు. PSలో థర్డ్ డిగ్రీ ఇస్తున్న వీడియోను పోస్ట్ చేసి ఓం రౌత్ కు ఇదే సరైన ట్రీట్మెంట్ అని కామెంట్స్ చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news