‘సరిలేరు నీకెవ్వరు’ మీద సంచలన వ్యాఖ్యలు చేసిన రష్మిక ..!

-

కన్నడ బ్యూటి రష్మిక మందన్న ప్రస్తుతం బాగా ఫ్రస్టేషన్ లో ఉందట. అందుకు కారణం రెండు అని తెలుస్తోంది. వాస్తవంగా చెప్పాలంటే ప్రస్తుతం టాలీవుడ్ లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్స్ లిస్ట్ లో రష్మిక మందన్న సెకండ్ ప్లేస్ లో ఉంది. ఫస్ట్ ప్లేస్ లో పూజా హెగ్డే ఉన్న సంగతి తెలిసిందే. టాలీవుడ్ హీరో నాగ శౌర్య నటించిన ఛలో సినిమాతో టాలీవుడ్ లో రష్మిక మందన్న ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఆ సినిమా సూపర్ హిట్ అవడంతో రష్మిక స్టార్ తిరిగిపోయింది.

 

ఏకంగా సూపర్ స్టార్ మహేష్ బాబు సరసన నటించే ఛాన్స్ అందుకుంది. సక్సస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన సరిలేరు నీకెవ్వరు సినిమాలో సూపర్ స్టార్ కి జంటగా నటించింది. ఈ సినిమా సంక్రాంతి కానుకగా అల్లు అర్జున్ నటించిన అల వైకుంఠపురములో సినిమాతో పోటీ పడిన కమర్షియల్ హిట్ గా నిలిచింది. అయితే ఏ విషయంలో కూడా అల సినిమాని బీట్ చేయలేకపోయింది. ముఖ్యంగా హీరోయిన్స్ విషయానికొస్తే అల వైకుంఠపురములో సినిమాకి పూజా హెగ్డే ఎంత ప్లస్ అయిందో సరిలేరు నీకెవ్వరు సినిమాకి రష్మిక మందన్న అంత మైనస్ అన్న కామెంట్స్ వినిపించాయి. చెప్పాలంటే ఆ సినిమా గురించి మాట్లాడుకుంటే ఇప్పటికి అదే మాట్లాడుకుంటున్నారు.

సరిలేరు నీకెవ్వరు సినిమాలో సూపర్ స్టార్ పక్కన హీరోయిన్ గా ఎంతమాత్రం సూటవలేదని కామెంట్స్ చేశారు. ఒకరకంగా చెప్పాలంటే సినిమాలో ఉన్న మైనస్ లలో మేజర్ మైనస్ హీరోయిన్ రష్మిక నే అని అందరూ నిందలు వేశారు. ఇవన్ని చూసిన రష్మిక లోలోపల చాలా ఫీలవుతుందట. సినిమా ప్రమోషన్స్ కి నా వంతు ఏం చేయాలో అంతా చేశాను. అయినా నేను సూటవలేదని ఇప్పుడెలా అంటారు. ముందు ఆడిషన్ చేసినప్పుడు తెలీదా అంటూ ఫీలవుతుందట. దానికి తోడు రష్మిక కి పూజా హెగ్డే గట్టి పోటీగా నిలుస్తుంది. ఇదొక కారణం అయితే ప్రస్తుతం తన చేతిలో ఒకే ఒక్క సినిమా ఉంది. ఇంకో సినిమా అవకాశం కోసం ఎదురు చూస్తుంది. ఇది ఇంకొక కారణం. అందుకే పిచ్చ ఫ్రస్టేషన్ లో ఉందట.

Read more RELATED
Recommended to you

Latest news