ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్న ఆదాశర్మ.. వీడియో వైరల్!

-

ఆదాశర్మ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయవలసిన అవసరం లేదు. అయితే ఇటీవల ది కేరళ స్టోరీ హిట్ ను ఆమె ఇప్పుడు ఇంకా ఆస్వాదిస్తున్నారని చెప్పాలి. మే 11వ తేదీన తన పుట్టినరోజు కావడంతో శివాలయానికి వెళ్ళిన ఈమె అక్కడ ప్రత్యేక పూజలు నిర్వహించారు. అంతేకాదు అందుకు సంబంధించిన వీడియో కూడా ఇప్పుడు నెట్టింట చాలా వైరల్ గా మారింది.ఇదిలా వుండగా కాంట్రవర్సీలకు కేరాఫ్ అడ్రస్ గా మారింది కేరళ స్టోరీ సినిమా. ఇక దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ టాక్ తో దూసుకుపోతోంది. అంతేకాదు ఇందులో నటించిన ప్రతి ఒక్కరికి కూడా మంచి గుర్తింపు వచ్చింది.

ముఖ్యంగా ఆదాశర్మ కి ముందు కంటే ఎక్కువ క్రేజ్ లభించిందని చెప్పాలి. ఈ నేపథ్యంలోనే ఆమెకు సంబంధించి వీడియో, ఫోటోలు కూడా వైరల్ గా మారుతున్నాయి. ఇకపోతే తాజాగా మే 11న 31 పుట్టినరోజు జరుపుకున్న ఈ ముద్దుగుమ్మ గర్భగుడిలో శివుడికి దగ్గరగా కూర్చుని శివతాండవం మంత్రాలను ఉచ్చరించారు. అంతేకాదు ఇందుకు సంబంధించిన వీడియో ని కూడా నెట్టింట షేర్ చేశారు ఆదాశర్మ. ఇది చూసిన చాలా మంది ఆమె భక్తి భావానికి, మంత్రాన్ని ఉచ్చరిస్తున్న తీరుకు ఫిదా అవుతున్నారు.

ఇదిలా ఉండగా నిన్న ఆమె ఒక ముంబైలో ఆక్సిడెంట్ కి గురవగా అక్కడే ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. తన ఆరోగ్యం పై కూడా ట్విట్టర్ ద్వారా స్పందిస్తూ నేను బాగానే ఉన్నాను.. యాక్సిడెంట్ గురించి చాలామంది మెసేజ్లు చేస్తున్నారు. అందరం బాగానే ఉన్నాము.. సీరియస్ కాదు అంటూ తెలిపింద. ఇక శివాలయంలో ది కేరళ స్టోరీ హీరోయిన్ ప్రత్యేక పూజలు చేయించడం ఇప్పుడు మరింత వైరల్ గా మారింది.

 

View this post on Instagram

 

A post shared by Adah Sharma (@adah_ki_adah)

Read more RELATED
Recommended to you

Latest news