బన్ని చేస్తుంది మల్టీస్టారర్.. త్రివిక్రం సినిమాలో అక్కినేని హీరో..!

-

త్రివిక్రం, అల్లు అర్జున్ కాంబినేషన్ లో థర్డ్ మూవీ మొదలైంది. నా పేరు సూర్య తర్వాత అల్లు అర్జున్ చేస్తున్న ఈ సినిమాలో పూజా హెగ్దె హీరోయిన్ గా నటిస్తుందని తెలుస్తుంది. హారిక హాసిని క్రియేషన్స్ బ్యానర్ తో పాటుగా గీతా ఆర్ట్స్ కూడా భాగస్వామ్యం అవుతుంది. అరవింద సమేత తర్వాత త్రివిక్రం చేస్తున్న ఈ సినిమా కూడా తండ్రి కొడుకుల సెంటిమెంట్ తో వస్తుందని తెలుస్తుంది.

ఈరోజు మొదలైన ఈ సినిమాలో అల్లు అర్జున్ స్టైలిష్ లుక్ లో కనిపిస్తున్నాడు. ఇక ఈ సినిమాలో అల్లు అర్జున్ తో పాటుగా మరో హీరో కూడా ఉంటాడని తెలుస్తుంది. ఇంతకీ ఆ హీరో ఎవరు అంటే అక్కినేని ఫ్యామిలీ హీరో సుశాంత్ అని తెలుస్తుంది. సినిమాలో ఓ ఇంపార్టెంట్ రోల్ లో సుశాంత్ నటిస్తాడని ఫిల్మ్ నగర్ టాక్. చిలసౌతో ప్రేక్షకులను మెప్పించిన సుశాంత్ ఇలా సైడ్ హీరో రోల్ చేయడం ఇదే మొదటిసారి. బన్ని లాంటి స్టార్ హీరో సినిమాలో ఇంపార్టెంట్ రోల్ అంటే కచ్చితంగా సుశాంత్ కు లక్ కలిసి వచ్చినట్టే.

Read more RELATED
Recommended to you

Latest news