‘అలవైకుంఠపురములో’ మ్యూజికల్ కన్సర్ట్  వెన్యూ, డేట్ ఫిక్స్….. ఎప్పుడు, ఎక్కడంటే….??

-

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ అలవైకుంఠపురములో సినిమా నుండి ఇప్పటికే రిలీజ్ అయిన నాలుగు సాంగ్స్ మరియు ఫస్ట్ లుక్ టీజర్ కు బన్నీ ఫ్యాన్స్, టాలీవుడ్ ప్రేక్షకుల నుండి విపరీతమైన రెస్పాన్స్ రావడం జరిగింది. ఇక రాములో రాముల, సామజవరగమనా సాంగ్స్ అయితే, వంద మిలియన్లకు పైగా వ్యూస్ తో దూసికుపోయిన విషయం తెలిసిందే. ఎస్ ఎస్ థమన్ అద్భుతమైన సంగీతాన్ని అందించిన ఈ సినిమాకు పీఎస్ వినోద్ ఫోటోగ్రఫిని అందిస్తుండగా గీతా ఆర్ట్స్, హారిక హాసిని క్రియేషన్స్ సంస్థలు ఈ సినిమాను ఎంతో భారీగా నిర్మిస్తున్నాయి.

పూజ హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో సీనియర్ నటి టబు ఒక కీలక పాత్రలో నటిస్తుండగా అక్కినేని సుశాంత్, నివేత పేతురాజ్ ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ఇకపోతే ఈ సినిమా మ్యూజికల్ కన్సర్ట్ ని జనవరి 6వ తేదీన హైదరాబాద్ లోని యూసఫ్ గూడ ప్రాంతంలో గల పోలీస్ గ్రౌండ్స్ లో సాయంత్రం 5 గంటల నుండి నిర్వహిస్తున్నట్లు సినిమా యూనిట్ కాసేపటి క్రితం ఒక ప్రకటన రిలీజ్ చేసింది.

మరోవైపు సూపర్ స్టార్ మహేష్ నటిస్తున్న సరిలేరు నీకెవ్వరు ప్రీ రిలీజ్ ఈవెంట్ ఒకరోజు ముందుగా, అనగా జనవరి 5న ఎంతో గ్రాండ్ గా ప్లాన్ చేయడం, అలానే దానికి మెగాస్టార్ చిరంజీవి ప్రత్యేక అతిథిగా వస్తుండడంతో, ఆ సినిమాకు గట్టిగా పోటీ ఇచ్చేలా 6వ తేదీన ఈ సినిమా మ్యూజికల్ కన్సర్ట్ ని ఏర్పాటు చేస్తున్నలు తెలుస్తోంది. ఒక రకంగా ఇది ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లాంటిదేనని, ఈ సినిమాలోని సాంగ్స్ ఎంతో పెద్ద హిట్ కావడంతో మ్యూజికల్ కన్సర్ట్ పేరుతో సినిమా యూనిట్ దీనిని ఎంతో గ్రాండ్ గా జరుపనుందట. ఇక ఈ వేడుకకు టాలీవుడ్ కి చెందిన ఇద్దరు స్టార్ హీరోలు రానున్నారని, దానికి సంబందించిన అప్ డేట్ సరిగ్గా నూతన సంవత్సరం రోజైన జనవరి 1 వెలువడనుందని టాలీవుడ్ వర్గాల టాక్. మరి అది ఎంతవరకు నిజమో తెలియాలంటే మరికొద్దిరోజులు వెయిట్ చేయాల్సిందే….!!

Read more RELATED
Recommended to you

Latest news