రాజకీయాల్లోకి రావడంపై అల్లరి నరేష్ సంచలన ప్రకటన

-

రాజకీయాల్లోకి రావడంపై టాలీవుడ్‌ హీరో అల్లరి నరేష్ సంచలన ప్రకటన చేశారు. నాంది తర్వాత అల్లరి నరేష్ నుంచి వస్తున్న మరో ఇంట్రెస్టింగ్ మూవీ ‘ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం’. నాంది సినిమా మంచి విజయాన్ని సాధించడమే కాదు నటుడిగా నరేష్ కు చాలా మంచి గుర్తింపుని తెచ్చిపెట్టింది.

ఏఆర్ మోహన్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ మూవీలో అల్లరి నరేష్ సరసన ఆనంది హీరోయిన్ గా నటిస్తోంది. అయితే, ఈ సినిమా పొలిటికల్‌ బ్యాగ్‌ బ్రాప్‌ లో వస్తున్న నేపథ్యంలో… నరేష్‌ రాజకీయాల్లోకి వస్తారని ప్రచారం జరిగింది. అయితే.. దీనిపై నరేష్‌ స్పందించారు. రాజకీయాలు నాకు ఇంట్రెస్ట్ లేని సబ్జెక్ట్ అని.. రాజకీయాల్లోకి రానని కుండ బద్దలు కొట్టి చెప్పారు టాలీవుడ్‌ హీరో అల్లరి నరేష్. సున్నితంగా ఉండే నా లాంటి వాళ్ళకి రాజకీయాలు సరిపోవన్నారు హీరో అల్లరి నరేష్.

Read more RELATED
Recommended to you

Latest news