అల్లు అర్జున్‌కు అరుదైన గౌరవం..

-

‘పుష్ప’ సినిమాతో పాన్ ఇండియా స్టార్ అయిపోయిన అల్లు అర్జున్ కు తాజాగా అరుదైన గౌరవం లభించింది. ఐకాన్ స్టార్ బన్నీ తన సతీమణి స్నేహతో కలిసి భారత దేశం తరఫున ప్రతినిధిగా గ్రాండ్ మార్షల్ హోదాలో న్యూ యార్క్ లో ‘ఇండియా డే పరేడ్’కు హాజరయ్యారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో తెగ వైరలవుతున్నాయి.

ఈ ఏడాది అనగా 2022కి అల్లు అర్జున్..భారతదేశం తరఫున గ్రాండ్ మార్షల్ గా పరేడ్ కు హాజరయ్యే అరుదైన అవకాశం పొందారు. భారత దేశం పట్ల ఉన్న దేశ భక్తిని ఈ విధంగా బన్నీ చాటుకున్నారు. ఆర్మీ బ్యాక్ డ్రాప్ లో వచ్చిన ‘నా పేరు సూర్య.. నా ఇల్లు ఇండియా’ చిత్రంలో అల్లు అర్జున్ దేశ భక్తి ఉన్న సోల్జర్ గా అత్యద్భుతంగా నటించి ప్రేక్షకుల ప్రశంసలు పొందారు.

ఇక ‘న్యూయర్క్ డే పరేడ్’ కు ప్రవాసులు రావడం రికార్డు అని ‘ఇండియా డే పరేడ్’ ప్రతినిధులు చెప్తున్నారు. ఈ పరేడ్ సందర్శన లో భాగంగా న్యూయార్క్ మేయర్ ఎరిక్ ఆడమ్స్‌ ను ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఎరిక్ ఆడమ్ ..బన్నీతో మాట్లాడుతున్న క్రమంలో ‘పుష్ప’ పిక్చర్ లోని ‘తగ్గేదేలే’ ఫోజు గురించి చెప్పడంతో పాటు ఆమె కూడా అలా ఫోజు ఇవ్వడం విశేషం. బన్నీ త్వరలో ‘పుష్ప-2’ షూటింగ్ లో పాల్గొననున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news