మరోసారి నిరసనబాట పట్టిన దిల్లీ రైతులు

-

కర్షకుల కోపానికి కేంద్రం మరోసారి కారణమైంది. రైతుల నిరసనలకు నిరసనలకు దేశ రాజధాని మరోసారి వేదికైంది. నిరుద్యోగ సమస్య, తమ మునుపటి సమస్యల పరిష్కారం కోసం జంతర్‌మంతర్ వద్ద నిర్వహిస్తోన్న మహా పంచాయత్‌లో పాల్గొనాలని రైతు సంఘాలు పిలుపునిచ్చాయి. దీంతో వివిధ రాష్ట్రాల నుంచి వందల మంది అన్నదాతలు దేశ రాజధానికి చేరుకున్నారు. జంతర్‌మంతర్‌ వద్ద శాంతియుత ఆందోళనలు చేస్తున్నారు.

జంతర్‌మంతర్‌ వద్ద మహాపంచాయత్‌ నేపథ్యంలో దేశ రాజధానిలో దిల్లీ పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు. అన్నదాతల ఆందోళనల దృష్ట్యా దిల్లీలో 144 సెక్షన్ విధించారు. దిల్లీ సరిహద్దు ప్రాంతాల్లో భారీగా పోలీసులను మోహరించారు. గాజీపూర్, సింఘూ, టిక్రీ సరిహద్దుల్లో బారికేడ్లు ఏర్పాటు చేసి.. దిల్లీలోకి వస్తున్న అన్ని వాహనాలను క్షుణ్నంగా తనిఖీ చేస్తున్నారు. గాజీపూర్‌ సరిహద్దుల్లో దిల్లీ-మేరఠ్‌ ఎక్స్‌ప్రెస్‌ వేపై నిఘాను పటిష్ఠం చేశారు. దీంతో దిల్లీ సరిహద్దుల్లో పలుచోట్ల భారీగా ట్రాఫిక్‌ జాం అయింది.

ఆందోళనల్లో పాల్గొనకుండా రైతు సంఘం నేత రాకేశ్ టికాయిత్‌ను పోలీసులు అడ్డుకున్నారు. ఆదివారం దిల్లీకి వస్తున్న రాకేశ్‌ను గాజీపూర్‌ సరిహద్దుల్లో అదుపులోకి తీసుకుని మధువిహార్‌ పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు. దిల్లీలోని నిరుద్యోగ యువతను కలుసుకోనివ్వకుండా దిల్లీ పోలీసులు కేంద్రం కనుసన్నల్లో నడుచుకుంటున్నారని ఆయన మండిపడ్డారు.

Read more RELATED
Recommended to you

Latest news