32 ఏళ్ల తర్వాత రజనీ – అమితాబ్‌ కాంబో రిపీట్

-

సినిమా ఇండస్ట్రీలో కొన్ని కాంబినేషన్​లు ఎవర్ గ్రీన్. కేవలం హీరో హీరోయిన్ల కాంబోలే కాదు.. మల్టీస్టారర్ కాంబోలూ స్పెషలే. ఇక ఆనాటి హీరోలు మళ్లీ ఓసారి కలిసి తెరపై కనిపిస్తే చూడాలని ఉవ్విళ్లూరే ప్రేక్షకులు ఎందరో. అలా ప్రేక్షకులను తమ నటన.. అందంతో మైమరిపించిన ఓ కాంబో.. రజనీకాంత్.. అమితాబ్ బచ్చన్. ఈ ఎవర్ గ్రీన్ కాంబినేషన్ మరోసారి వెండితెరపై సందడి చేసేందుకు రంగం సిద్ధమవుతోంది.

రజనీకాంత్‌.. అమితాబ్‌ బచ్చన్‌ దాదాపు 32ఏళ్ల విరామం తర్వాత కలిసి తెర పంచుకోనున్నారు. రజనీ 170వ చిత్రంతో ఈ కాంబినేషన్‌ కార్యరూపంలోకి రానుంది. ఇది అమితాబ్‌కు తొలి తమిళ చిత్రం కానుంది. ఈ సినిమాని ‘జై భీమ్‌’ దర్శకుడు టి.జె.జ్ఞానవేల్‌ తెరకెక్కించనున్నారు. లైకా ప్రొడక్షన్స్‌ సంస్థ నిర్మిస్తోంది. బూటకపు ఎన్‌కౌంటర్లకు వ్యతిరేకంగా పోరాడే ఓ రిటైర్డ్‌ పోలీస్‌ ఆఫీసర్‌ కథగా ఈ చిత్రం రూపొందనున్నట్లు తెలిసింది.

ఆ పోలీస్‌ పాత్రను రజనీ పోషించనుండగా.. మరో ముఖ్య పాత్రలో అమితాబ్‌ నటించనున్నారని సమాచారం. రజనీ – అమితాబ్‌ చివరిగా 1991లో వచ్చిన ‘హమ్‌’ సినిమాలో కలిసి నటించారు.

Read more RELATED
Recommended to you

Latest news