AAA సినిమాస్ మల్టీప్లెక్స్ ప్రారంభం.. ఏ సినిమాతో అంటే..?

-

ప్రస్తుత కాలంలో చాలా మంది సెలబ్రిటీలు సినిమాలలో సంపాదిస్తున్న డబ్బును ఒకవైపు బిజినెస్ రంగంలో మరొకవైపు రియల్ ఎస్టేట్లో పెట్టబడులుగా పెడుతున్న విషయం తెలిసిందే . ఇప్పటికే చాలామంది హీరోలు వ్యాపారాలలో కూడా రాణిస్తూ మరింత పేరు దక్కించుకున్నారు. ఈ క్రమంలోనే అల్లు అర్జున్ కూడా తాజాగా వ్యాపారంలోకి అడుగుపెట్టిన విషయం తెలిసిందే. ఇప్పటికే రెస్టారెంట్ తో పాటు ఇతర రంగాలలో కూడా పెట్టుబడులు పెట్టిన అల్లు అర్జున్ మల్టీప్లెక్స్ రంగంలోకి కూడా అడుగుపెడుతున్నారు. ఏషియన్ సినిమాస్ తో కలిసి బన్నీ ఒక భారీ మల్టీప్లెక్స్ నిర్మిస్తున్నారు. అమీర్ పేట్ సత్యం థియేటర్ ను కూల్చేసి అక్కడ ఏషియన్ అల్లు అర్జున్ పేరుతో మల్టీప్లెక్స్ నిర్మాణం చేపట్టడం జరిగింది. ఇక ఈ మల్టీప్లెక్స్ నిర్మాణం దాదాపుగా పూర్తయిందనే చెప్పాలి.

ఇదిలా ఉండగా తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం.. ఈ మల్టీప్లెక్స్ ను జూన్ 16వ తేదీన ప్రారంభించబోతున్నట్లు అది కూడా ఆది పురుష్ చిత్రం చేత ఈ థియేటర్ ను ఓపెన్ చేయించబోతున్నట్లు తెలుస్తోంది. దీన్ని బట్టి చూస్తే AAA మల్టీప్లెక్స్ లో మొట్టమొదటిగా ఆది పురుష్ స్క్రీనింగ్ చేయాలని అల్లు అర్జున్ భావిస్తున్నట్లు సమాచారం. రామాయణం ఇతివృత్తం ఆధారంగా తెరకెక్కిన సినిమా కావడం చేత ప్రభాస్ క్రేజ్ ను క్యాష్ చేసుకునే విధంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

ఇకపోతే ఈ సినిమా ప్రదర్శన పై మరో రెండు రోజుల్లో క్లారిటీ వచ్చే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఇప్పటికే మల్టీప్లెక్స్ కి సంబంధించిన ఫోటోలు కూడా సోషల్ మీడియాలో చాలా వైరల్ అవుతున్నాయి. ఇక అల్లు అర్జున్ కెరీర్ విషయానికి వస్తే ప్రస్తుతం ఐకాన్ స్టార్ బన్నీ పుష్ప 2 షూటింగ్లో బిజీగా ఉన్నారు. మొదట భాగం ఊహించిన స్థాయిలో విజయం అందుకోవడంతో ఇప్పుడు అందరి దృష్టి కూడా సీక్వెల్ పైన పడింది. ఇక అందుకే అభిమానుల అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా దర్శకుడు సుకుమార్ భారీగా ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.

Read more RELATED
Recommended to you

Latest news