విజయ్ దేవరకొండతో వివాదానికి ఫుల్​స్టాప్ పెట్టిన అనసూయ

-

జబర్దస్త్ షోతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది అనసూయ. ఆ షోతో వచ్చిన పాపులారిటీతో నెమ్మదిగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది. అయితే గత కొంతకాలంగా ఈ బ్యూటీకి.. టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండతో కాంట్రవర్సీ నడుస్తున్న విషయం తెలిసిందే. తాజాగా అనసూయ ఓ ఇంటర్వ్యూలో ఈ వివాదంపై మాట్లాడారు.

‘‘విమానం’ ప్రమోషన్స్‌లో భాగంగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో విజయ్‌ దేవరకొండతో వివాదంపై మాట్లాడాను. వివాదానికి గల కారణాన్ని ఎన్నోసార్లు చెప్పాలనుకున్నాను. కాకపోతే కుదరలేదు. మొదటిసారి ఆ ఇంటర్వ్యూలో చెప్పాను. విజయ్‌ టీమ్‌లోని ఒక వ్యక్తి నాపై సోషల్‌మీడియాలో ట్రోల్స్‌ క్రియేట్‌ చేయిస్తున్నాడని తెలుసుకుని బాధపడ్డాను. ఒక మహిళను ఇలా ఎలా అవమానిస్తారని కోపం వచ్చింది. సమయం వచ్చినప్పుడల్లా వివాదం గురించి మాట్లాడాలనుకున్నా. ఈ విషయంపై విజయ్‌తో మాట్లాడాలని ప్రయత్నించాను. నాకు పీఆర్‌లు లేరు. నాకు నేనే స్పోక్స్‌ పర్సన్‌. నాకు ఆత్మగౌరవం ఉంది. ఇక, మానసిక ప్రశాంతత కోసమే ఈ వివాదాన్ని ఇంతటితో వదిలేయాలనుకుంటున్నా’’ అని అనసూయ తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news