రవితేజ “రామారావు ఆన్ డ్యూటీ” నుండి మరో అప్డేట్

-

శరత్ మండవ దర్శకత్వంలో మాస్ మహారాజా రవితేజ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం “రామారావు ఆన్ డ్యూటీ”. ఈ సినిమాలో రవితేజ ప్రభుత్వ అధికారిగా కనిపించబోతున్నారు. యదార్థ సంఘటనల ఆధారంగా తెరకెక్కుతున్న ఈ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాలో రవితేజ కు జోడీగా దివ్యాంశ కౌశిక్, రజియా విజయన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. హీరో వేణు తొట్టెంపూడి రీ ఎంట్రీ తో ఒక కీలక పాత్రలో కనిపించబోతున్నారు.

కిలాడి తో అభిమానులను తీవ్రంగా నిరాశపరిచిన మాస్ మహారాజా ఈసారి రామారావు ఆన్ డ్యూటీ తో ఎలాగైనా మంచి హిట్ సాధించాలని కసితో ఉన్నాడు. ఈ చిత్రం జూలై 29 న విడుదల కానుంది. ఈ క్రమంలో చిత్రబృందం వరుస అప్డేట్లను ఇస్తోంది. తాజాగా మేకర్స్ మరో అప్డేట్ ను ప్రకటించారు. ఈ చిత్రంలోని థర్డ్ సింగిల్ అనౌన్స్మెంట్ ను గురువారం సాయంత్రం 4.05 నిమిషాలకు ప్రకటించనున్నట్లు తెలిపారు. అంతేకాకుండా గ్లింప్స్ ని కూడా విడుదల చేయనున్నట్లు తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news