కుంచె పట్టిన ‘ఓయ్ ‘ భామ..

-

బాలనటిగా సినీ ఇండస్ట్రీకి పరిచయమైన షామిలి చిన్నప్పుడే స్టార్ స్టేటస్ అందుకుంది. ఇండస్ట్రీలో పలువురు స్టార్ హీరోలతో నటించి మంచి పేరు సంపాదించుకుంది. చిన్నప్పుడు ఎన్నో సినిమాల్లో కనిపించిన ఈమె హీరోయిన్గా మాత్రం పెద్దగా నిలబడలేకపోయింది. కాగా ప్రస్తుతం పెయింటింగ్ ఫీల్డ్ లో అడుగుపెట్టినట్టు తెలుస్తుంది.

తమిళ తెలుగు భాషల్లో చైల్డ్ ఆర్టిస్ట్ గా మంచి గుర్తింపు సంపాదించుకున్న నటి శామిలి.. తమిళ స్టార్​ అజిత్​ సతీమణి షాలినీ చిన్న చెల్లెలైన షామిలీ హీరోయిన్గా కొన్ని సినిమాల్లో నటించి ప్రస్తుతం మాత్రం పెయింటింగ్ వైపు అడుగులు వేసినట్టు తెలుస్తోంది.

చైల్డ్ ఆర్టిస్ట్ గా ‘కిల్లర్’, ‘జగదేకవీరుడు అతిలోకసుందరి’, ‘నాగబాల’, అంజలి వంటి చిత్రాల్లో నటించింది. అంజలి చిత్రంలో ఈమె నటనకి జాతీయ అవార్డు సైతం వచ్చింది. ఇక తెలుగులో సిద్ధార్థ్​ హీరోగా తెరకెక్కిన ‘ఓయ్’​ సినిమాతో హీరోయిన్​గా తెరపైకి ఎంట్రీ ఇచ్చింది. అనంతరం మలయాళ ,కన్నడ ఇండస్ట్రీల్లోనూ పలు సినిమాల్లోనూ నటించింది. అనంతరం కొన్నాళ్లపాటు సినిమాలకు దూరమైన ఈమె కొంత గ్యాప్ అనంతరం 2018 లో నాగశౌర్యతో అమ్మమ్మగారి ఇల్లు సినిమాతో మరోసారి తెరపై కనిపించింది.

ప్రస్తుతం ఈమె తన ఫోకస్ మొత్తం చిత్రలేఖనంపై పెట్టినట్టు తెలుస్తోంది. పెయింటింగ్ పై తనకు ఎంతో ఆసక్తి ఉందని ఇప్పటికే పలు ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చిన షామిలి ఇందుకోసం అమెరికా సైతం వెళ్లి ట్రైనింగ్ తీసుకున్నట్టు తెలిపింది. అలాగే బెంగుళూరు, చెన్నై లాంటి ప్రాంతాల్లో జరిగిన పలు పెయింటింగ్‌ ఎగ్జిబిషన్లలో తన పెయింటింగ్స్ ప్రదర్శనకు ఉంచానని త్వరలోనే చెన్నైలో సొంతంగా ఓ పెయింటింగ్ ఎగ్జిబిషన్ నిర్వహించడానికి ప్రయత్నాలు కూడా చేస్తున్నట్టు తెలిపింది. ప్రస్తుతం తన దృష్టి మొత్తం పెయింటింగ్స్ పైనే ఉందని మళ్లీ నటిస్తానో లేదో తెలియదని ప్రస్తుతం అయితే ఏ సినిమాలో నటించలేదని చెప్పుకొచ్చింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version