బెల్లంకొండ శ్రీనివాస్ కొత్త సినిమాకి ముహూర్తం ఫిక్స్‌..!

-

అల్లుడు శీను సినిమాతో వెండితెరకి పరిచయం అయ్యాడు బెల్లంకొండ శ్రీనివాస్.. ఈ సినిమా హీరోగా సాయి శ్రీనివాస్ ఒకే అనిపించినా నిలదొక్కుకునే హిట్టును మాత్రం అందించలేకపోయింది. అయితే ఈ మధ్య వచ్చిన ‘రాక్షసుడు’ సినిమాతో ఒక హిట్ ను తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ సినిమా మంచి హిట్టు కావడంతో కథల ఎంపికలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు బెల్లంకొండ. తాజాగా ఆయన మరో దర్శకుడికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఆ దర్శకుడు ఎవరో కాదు సంతోశ్ శ్రీనివాస్.

గతంలో ‘కందిరీగ’ సినిమాతో హిట్ కొట్టిన సంతోష్ శ్రీనివాస్, ఆ తరువాత చేసిన ‘రభస’ .. ‘హైపర్’ పరాజయంపాలు కావడంతో రేసులో వెనకబడ్డాడు. ఆ మధ్య ఒకరిద్దరు హీరోలతో ప్రాజెక్టులను సెట్ చేసుకోవడానికి ప్రయత్నించాడుగానీ కుదరలేదు. ఇటీవల ఆయన ఒక కథ చెప్పేసి బెల్లంకొండ శ్రీనివాస్ ను ఒప్పించాడు. ఈ సినిమాను ఈ నెల 29వ తేదీన లాంచ్ చేయనున్నారు. ఆ రోజున మిగతా వివరాలు తెలియనున్నాయి. దేవిశ్రీ ప్రసాద్ ఈ సినిమాకి సంగీతాన్ని సమకూర్చుతున్నాడు.

Read more RELATED
Recommended to you

Latest news