బిగ్‌బాస్ 4 : కంటెస్టెంట్‌ల ట్రాజెడీ స్టోరీస్‌!

-

 

బిగ్‌బాస్ సీజ‌న్ 4 ప‌డుతూ లేస్తూ న‌డుస్తోంది. గ‌త ఐదు వారాలుగా దీని టీఆర్పీ రేటింగ్ ముందు తో పోలిస్తే ప్ర‌స్తుతం బెట‌ర్‌గా మారుతోంది. 16 మందిలో మొద‌లైన ఈ షో ఆ త‌రువాత ఇద్ద‌రు వైల్డ్ కార్డ్ ఎంట్రీతో ఇద్ద‌రు స‌భ్యులు ఎంట‌ర్ కావ‌డంతో ఆ సంక్ష 18కి చేరింది. స్వాతీ దీక్షిత్‌, అవినాష్ మ‌ధ్య‌లో ఎంట్రీ ఇచ్చారు. మ‌ధ్య‌లో వారం కూడా తిర‌క్కుండ‌నే స్వాతీ దీక్షిత్ బ‌య‌టికి వ‌చ్చేసింది. ముందు ఎంపికైన స‌భ్యుల్లో గంగ‌వ్వ‌తో క‌లిసి ఐదు గురు ఇంటి దారి ప‌ట్టారు.

39వ రోజులోకి ఎంట‌రైన బిగ్‌బాస్ షో క్ర‌మంగా ర‌స‌వ‌త్త‌ర మ‌లుపులు తిరుగుతోంది. ఈ షోలో ముక్కు అవినాష్ ఎంట‌ర్‌టైన్‌మెంట్‌ని పండిస్తూ ముందుకు తీసుకెళుతున్నాడు. అత‌ని వ‌ల్లే వీక్ష‌కుల‌కి ఎంట‌ర్‌టైన్‌మెంట్ ల‌భిస్తోంది. షోకు అది ప్ల‌స్ పాయింట్‌గా మారుతోంది. ఇదే అద‌నుగా అవినాష్ మెనాల్‌ని కాకా ప‌ట్ట‌డం మొద‌లుపెట్టాడు. అరియానా ముందే మోనాల్‌ని ముగ్గులోకి దింపేందుకు ప్ర‌య‌త్నాలు చేస్తుంటే ఇది చూడ్డానికేనా నేనుంది అంటూ అమ్మ‌రాజ‌శేఖ‌ర్ సెటైర్లు వేయ‌డం న‌వ్వులు పూయించింది.

ఇదిలా వుంటే గురువారం షో సాంతం కంటెస్టెంట్‌ల ట్రాజెడీ స్టోరీల‌తో సాగింది. చిన్ననాటి జ్ఞాప‌కాలతో పాటు త‌మ ఫ్యామిలీకి ఎదురైన చేదు అనుభ‌వాల‌ని ట్రాజెడీ స్టోరీస్‌ని కంటెస్టెంట్స్ పంచుకున్నారు. హార‌క త‌న త‌ల్లిదండ్రులు విడిపోయి వేరుగా వుంటుంటే త‌ను, త‌న బ్ర‌ద‌ర్ త‌ల్లితో క‌లిసి వుంటున్నామ‌ని క‌న్నీరు పెట్టించింది. అమ్మ రాజ‌శేఖ‌ర్ త‌న త‌ల్లి గురించి చెప్పి భావోద్వేగానికి లోన‌య్యేలా చేశాడు. లాస్య త‌న ప్రేమ పెళ్లిపై పెద్ద‌ల అల‌క, త‌ను పుట్టిన సంద‌ర్భంలో త‌ల్లి ప‌డిన వేద‌న గురించి చెప్పుకొచ్చింది. ఇక అరియానాది మ‌రో క‌థ‌.. అరియానా అస‌లు పేరు అర్చ‌న‌. త‌న త‌ల్లి న‌ర్స్‌.. భ‌ర్త దూరం పెడితే ఒంట‌రిగా త‌మ‌ని పెంచి ఇంత వాళ్ల‌ని చేసింద‌ని, నాలుగు వేల ఉద్యోగం కోసం నానా పాట్లు ప‌డ్డాన‌ని చెప్పుకొచ్చింది. గురువారం ఎపిసోడ్ ఇలా కంటెస్టెంట్‌ల ట్రాజెడీ స్టోరీల‌తో బ‌రువెక్కిపోయింది.

Read more RELATED
Recommended to you

Latest news