ప్రేమ జంటను విడదీస్తున్న గంగవ్వ.. ఎలిమినేట్ అయ్యేది ఆమెనే?

-

బిగ్ బాస్ సీజన్ 4 ప్రారంభమైన మొదట్లో షోపై పెద్దగా ఆసక్తి వచ్చేలా చేయలేకపోయిన నిర్వాహకులు ఆ తర్వాత టాస్క్ లు, ట్రై యాంగిల్ లవ్ స్టోరీ ద్వారా ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచారు. నిన్నటి ఎపిసోడ్ గానగంధర్వుడు ఎస్పీ బాలుకు నాగార్జున నివాళులిస్తూ ప్రారంభమైంది. బాలు మరణంతో నాగార్జున భావోద్వేగానికి గురయ్యారు. నిన్నటి ఎపిసోడ్ లో గత వారం వెక్కివెక్కి ఏడ్చిన గంగవ్వ హుషారుగా కనిపించింది.

 

హౌస్ లో తనకు అఖిల్ అంటే ఎంతో ఇష్టమని.. అఖిల్ ను దత్త పుత్రుడిగా స్వీకరిస్తానని.. అఖిల్ కు మోనాల్ తో మాట్లాడవద్దని తాను అఖిల్ కు చెప్పానని గంగవ్వ చెప్పగా మోనాల్ కంటతడి పెట్టుకుంది. నాగార్జున ముందు కూడా మోనాల్ హర్ట్ అయ్యే విధంగా గంగవ్వ కామెంట్లు చేసింది. అబ్బాయిలతో అబ్బాయిలు, అమ్మాయిలతో అమ్మాయిలు ఉండాలని చెబుతూ పరోక్షంగా మోనాల్ కు కౌంటర్లు ఇచ్చింది.

నాగార్జున నామినేషన్ లో ఉన్న కంటెస్టెంట్లతో ఆటలు ఆడించి తను అడిగిన ప్రశ్నలకు కంటెస్టెంట్ల నుంచి సమాధానాలు రప్పించారు. హారిక కుమార్ సాయి తనకు పోటీ కాదని చెప్పగా.. మోనాల్ సోహైల్ నారదుడు అని చెప్పింది. లాస్య మోనాల్ అబద్ధాల కోరు అంటూ కామెంట్ చేసింది. దేవి నాగవల్లి కుమార్ సాయిలో క్లారిటీ లేదని.. అతడిని ఎలిమినేట్ అయిన వారి స్థానంలో తీసుకురావచ్చని పేర్కొంది.

మెహబూబ్ కుమార్ సాయి అసలు ఇంట్లో ఉండే అర్హత లేదని సొహైల్ తనకు మంచి ఫ్రెండ్ అని చెప్పుకొచ్చాడు. నాగార్జున ఏడుగురు కంటెస్టెంట్లలో లాస్య సేఫ్ అయిందని మొదట ప్రకటించాడు. గంగవ్వ హారిక బ్రష్ చేసుకోకుండానే కాఫీలు, టీలు తాగుతోందంటూ అందరిముందూ ఆమె పరువు తీసింది. ఆ తర్వాత మోనాల్ కూడా సేఫ్ అయినట్టు నాగ్ ప్రకటించాడు. ఇకపోతే బిగ్ బాస్ హౌస్ నుంచి ఈ వారం దేవి నాగవల్లి ఎలిమినేట్ అయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news