Bigboss6: అందుకే డబ్బు తీసుకోవాల్సి వచ్చిందంటున్న శ్రీ హాన్..!

-

ప్రస్తుతం తెలుగు బిగ్ బాస్ సీజన్ సిక్స్ కార్యక్రమం డిసెంబర్ 18న ఆదివారం రోజు గ్రాండ్ ఫినాలేని ఎంతో ఘనంగా జరిపి సీజన్ సిక్స్ ను పూర్తి చేసిన విషయం తెలిసిందే. ఇందులో టాప్ 5 కంటెస్టెంట్లుగా శ్రీహాన్, రేవంత్, కీర్తి ,ఆదిరెడ్డి, రోహిత్ నిలువగా చివరికి శ్రీహన్, రేవంత్ ఫైనలిస్ట్ గా మిగిలారు. నాగార్జున 40 లక్షల రూపాయల మనీ ఆఫర్ చేయడంతో ఇద్దరు కూడా మొదట్లో కప్పు కోసం పోటీపడ్డారు. కానీ ప్రైజ్ మనీ రూ. 40 లక్షలకు చేరుకోవడంతో శ్రీహాన్ పేరెంట్స్ సైతం ఆ డబ్బు తీసుకోమని చెప్పారు. అందుకే ఆయన ఆ రూ.40 లక్షల రూపాయల గోల్డెన్ బ్రీఫ్ కేస్ తీసుకుని హౌస్ నుంచి బయటకు వచ్చారు.

అయితే రేవంత్ ట్రోఫీ గెలుచుకొని బయటకు వచ్చిన విషయం తెలిసిందే. ఇదిలా ఉండగా శ్రీహాన్ టైటిల్ విన్నర్ ను కావాలనే మిస్ చేసుకున్నాడు అని వార్తలు బాగా వినిపించాయి. అయితే ఆయన డబ్బులు తీసుకోవడం వెనుక కొంతమంది విమర్శలు కూడా చేశారు. ఈ క్రమంలోనే బిగ్ బాస్ తర్వాత బయటకు వచ్చిన శ్రీహాన్ వరుస ఇంటర్వ్యూలు ఇస్తూ.. తాను డబ్బు తీసుకోవడానికి గల కారణం ఏమిటి అనే విషయాన్ని వెల్లడించారు.

శ్రీహాన్ మాట్లాడుతూ.. మొదటి నుంచి రేవంత్ కప్పు గెలవాలని చెబుతూ ఉండేవాడు. అయితే నాకు కప్పు గెలవడంతో పాటు డబ్బు కూడా అవసరం. ఇంత పెద్ద మొత్తంలో డబ్బులు నేను ఎప్పుడూ అందుకోలేదు.. ప్రస్తుతం నాకు ఆర్థిక పరిస్థితులు కూడా ఎదురవడం వల్ల ఈ నిర్ణయం తీసుకున్నాను. నేను మా అమ్మానాన్నల కోసం ఈ బిగ్ బాస్ కార్యక్రమానికి వచ్చాను. అయితే మా కుటుంబానికి ప్రస్తుతం డబ్బు చాలా అవసరం. అందుకే నాగార్జున సార్ 40 లక్షల రూపాయలు ఆఫర్ చేయడంతో ముందుగా మా తల్లిదండ్రుల నిర్ణయం తీసుకొని వారు తీసుకోమని చెప్పినప్పుడే ఆ డబ్బు తీసుకున్నాను అంటూ శ్రీహాన్ ఈ సందర్భంగా వెల్లడించారు.

Read more RELATED
Recommended to you

Latest news