Virupaksha : 100 కోట్లు దాటిన “విరూపాక్ష” సినిమా

-

కొత్త డైరెక్టర్ కార్తీక్ వర్మ దండు దర్శకత్వంలో సాయిధరమ్ తేజ్ హీరోగా మలయాళీ బ్యూటీ సంయుక్త మీనన్ హీరోయిన్గా తెరకెక్కిన తాజా చిత్రం విరూపాక్ష. ఇటీవలే విడుదలైన ఈ సినిమా మంచి రెస్పాన్స్ పొందుతోంది.సాధారణంగా ఇండస్ట్రీలో ఏ సినిమా అయినా సరే మంచి విజయం సొంతం చేసుకుంది.

అంటే కచ్చితంగా ఆ సినిమాకి పార్ట్ 2 ఉండాలని అభిమానులు కోరుకుంటూ వుంటారు. అయితే, సాయి ధరమ్ తేజ్, సంయుక్త మీనన్ జోడిగా నటించిన విరూపాక్ష మూవీ ఈనెల 21 నుంచి నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానున్నట్లు మేకర్స్ వెల్లడించారు. ఇది ఇలా ఉండగా.. ఈ సినిమా రిలీజ్‌ అయి దాదాపు నెల రోజులు అవుతోంది. ఈ తరుణంలోనే.. 100 కోట్ల క్లబ్‌ లో చేరింది విరూపాక్ష సినిమా. ఈ మేరకు అధికారిక ప్రకటన చేసింది చిత్ర బృందం.

Read more RELATED
Recommended to you

Latest news