హీరో దళపతి విజయ్, ఎవర్గ్రీన్ హీరోయిన్ త్రిష జంటగా.. లోకేశ్ కనగరాజ్ తెరకెక్కించిన చిత్రం ‘లియో’. తాజాగా ఈ సినిమా ట్రైలర్ను చిత్రబృందం విడుదల చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ ట్రైలర్ను ప్రదర్శించిన కొన్ని థియేటర్లకు సెన్సార్ బోర్డు షాక్ ఇచ్చింది. సెన్సార్ కట్ లేకుండా థియేటర్లో ప్రదర్శించినందున ఆయా థియేటర్ యజమానులకు లీగల్ నోటీసులు పంపింది. అభ్యంతర పదాలతో కూడిన ట్రైలర్ను చూపించారంటూ.. నిబంధనల ప్రకారం అలాంటి ట్రైలర్ను పబ్లిక్లో ప్రదర్శించకూడదని ఆ నోటీసుల్లో పేర్కొంది. దీనిపై వివరణ ఇవ్వాలని సెన్సార్ బోర్డు కోరింది.
ఇక రెండు నిమిషాలకు పైగా నిడివి ఉన్న ఈ ట్రైలర్ను చిత్రబృందం అక్టోబర్ 5న రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ ట్రైలర్ య్యూట్యూబ్లో ట్రెండింగ్లో ఉంది. ఇందులో వాడిన అభ్యంతర పదాల గురించి దర్శకుడు లోకేశ్ కనగరాజ్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో వివరణ ఇస్తూ.. ఆయా సన్నివేశాల్లో అలాంటి పదాలు వాడకపోతే ఎమోషన్ పండదని అందుకే వాటిని ఉపయోగించినట్లు క్లారిటీ ఇచ్చారు. ఈ సినిమా అక్టోబర్ 19న ప్రేక్షకుల ముందుకు రానుంది.