ఫ్యాన్స్ కోసం అపోలో దగ్గర చరణ్ స్పెషల్ గ్యాలరీ ..!

-

ఎట్టకేలకు ఉపాసన,రాంచరణ్ తల్లిదండ్రులయ్యారని చెప్పాలి. ఈరోజు ఉపాసన తెల్లవారుజామున పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. ఇక ఈ శుభవార్తను ఉపాసన రాంచరణ్ దంపతులు ఎప్పుడెప్పుడు తమతో తెలియజేస్తారా అని మెగా అభిమానులు కూడా పదేళ్లుగా ఎదురు చూస్తున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా ఎన్నోసార్లు మీడియా సమక్షంలో కూడా మెగా కాంపౌండ్ కి ఈ ప్రశ్నలు ఎదురయ్యాయని చెప్పవచ్చు. ఇక అలాంటి ప్రశ్నల మధ్య గత ఏడాది డిసెంబర్ 12న మొదటిసారి గుడ్ న్యూస్ చెప్పారు మెగాస్టార్ చిరంజీవి.

ఇకపోతే అప్పటినుంచి రామ్ చరణ్ దంపతులు వారసుడిని ఇస్తారా? లేక వారసురాలని ఇస్తారా? అని అభిమానులు తెగ ఆసక్తిగా ఎదురుచూసిన నేపథ్యంలో ఈరోజు ఆమె ఆడపిల్లకు జన్మనిచ్చింది. దీంతో అటు కొణిదెల ఇటు కామినేని ఫ్యామిలీ ఆనందంలో మునిగితేలుతున్నారు. ఇక తమ ఇంటికి వచ్చిన వారసురాల్ని లిటిల్ మెగా ప్రిన్సెస్ గా అభివర్ణించారు మెగాస్టార్ చిరంజీవి. నీ రాకతో మెగా ఫ్యామిలీ అమితానందాన్ని పొందుతోంది అంటూ చిరంజీవి ట్వీట్ చేయడం జరిగింది.

తల్లిదండ్రులుగా చెర్రీ ఉపాసన , గ్రాండ్ పేరెంట్స్ గా మేము గర్వపడుతున్నాము అంటూ తెలిపారు. ఇకపోతే అపోలో ఆసుపత్రి దగ్గర ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అభిమానులు కేకులు, స్వీట్ లతో పండగ చేసుకుంటున్నారు. కంగ్రాట్స్ అన్నయ్య , వదిన అంటూ ఫ్లెక్సీలు కూడా ఏర్పాటు చేస్తున్నారు.అంతే కాదు గిఫ్టులు, బొకేలతో హాస్పిటల్ కి చేరుకుంటున్నారు అభిమానులు. మొత్తానికైతే ఆ అభిమానుల కోసం ఆసుపత్రి దగ్గర స్పెషల్ గ్యాలరీ ఏర్పాటు చేశారు. ఏది ఏమైనా దాదాపు పది సంవత్సరాల తర్వాత మెగా ఇంట్లో ఉత్సవాలు అంబరాన్ని అంటుతున్నాయని చెప్పవచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news