అలాంటి పిచ్చితో ఆరోగ్యాన్ని పణంగా పెట్టిన కళ్ళు చిదంబరం..!!

-

టాలీవుడ్ లో విభిన్నమైన పాత్రలలో తన నటనతో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించే కమెడియన్లలో కళ్ళు చిదంబరం కూడా ఒకరు. చూడడానికి మనిషి చాలా విచిత్రంగా ఉన్నా ఈయన పంచు డైలాగులతో ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటూ ఉండేవారు. ఇక అంతే కాకుండా పలు ఆధ్యాత్మిక చిత్రాలలో కూడా నటించి మంచి గుర్తింపు పొందారు. మొదట ఈ నటుడు కళ్ళు అనే నాటకాన్ని వేస్తున్న సమయంలో ఎంవీ రఘు ఈ నాటకాన్ని చూసి చిదంబరాన్ని సినిమాలలో కమెడియన్గా తీసుకురావడం జరిగిందట. ఇక ఈ చిత్రం మంచి విజయం సాధించడంతో అప్పటినుంచి ఈయన పేరు కళ్లు చిదంబరం గా ముద్ర పడిపోయింది సినీ ఇండస్ట్రీలో.

 

చిదంబరం ఇలా సినిమాలు, నాటకాలు వేస్తూ భోజనం సరిగ్గా తినక నిద్ర లేక తన కంటిలోని నరాలు పక్కకు కదలడంతో ఆయనకు మెల్లకన్ను రావడం జరిగిందట. అయితే సినిమాలలోకి వచ్చిన తర్వాత ఆపరేషన్ ద్వారా తనకన్ను బాగు చేయించుకోవాలని అనుకున్నారట. కానీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన తర్వాత ఆయనకు వున్న ఆ కళ్ళ వల్లే పలు అవకాశాలు రావడంతో సినిమాల కోసం ఎలాంటి ఆపరేషన్ చేయించుకోకూడదని నిర్ణయాన్ని తీసుకున్నట్లు తన కుమారుడు ఒక ఇంటర్వ్యూలో తెలియజేయడం జరిగింది.

అలా తనకు ఉన్న మెల్లకన్ను అదృష్టంగా భావించి ఆపరేషన్ చేయించుకోకుండా అలాగే ఉండిపోయారట. అలా ఎన్నో సినిమాలలో నటిస్తూ భారీగానే సంపాదించారట కళ్ళు చిదంబరం. కళ్ళు చిదంబరం ఒక నటుడు గానే కాకుండా విశాఖ పోర్టు ట్రస్టులో అసిస్టెంట్ ఇంజనీరింగ్ గా కూడా పనిచేసేవారట. అలాగే ఎంతోమంది కళాకారులను ప్రోత్సహిస్తూ ఉండేవారట కళ్ళు చిదంబరం. ఏది ఏమైనా కళ్ళు చిదంబరం సినిమాల మీద మోజులో తన ఆరోగ్యాన్ని పణంగా పెట్టి సినిమాలలో నటించారని ఆయన అభిమానులు సైతం కామెంట్స్ చేస్తూ ఉన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news